iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: హైదరాబాద్ లో కానిస్టేబుల్ గొంతు కోసిన దొంగ!

బ్రేకింగ్: హైదరాబాద్ లో కానిస్టేబుల్ గొంతు కోసిన దొంగ!

హైదరాబాద్ లోని జియాగూడలో దారుణం చోటు చేసుకుంది. ఓ దొంగ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ గొంతు కోశాడు. ఇదే ఘటన ఇప్పుడు హైదరాబాద్ లో తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఏకేందర్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఈ క్రమంలోనే ఏకేందర్ శనివారం జియాగూడలోని ఓ చోట పోలీసులకు చిక్కాడు. ఇక అతడిని పట్టుకునేందుకు ఇద్దరు కానిస్టేబుల్స్ అలెర్ట్ అయ్యారు.

దీంతో ఆ దొంగ బరితెగించి.. కానిస్టేబుల్ అయిన ఉదయ్ గొంతు కోశాడు. దీంతో పాటు మరో కానిస్టేబుల్ పై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే మరి కొంతమంది కానిస్టేబుల్స్ అక్కడికి చేరుకుని దొంగ ఏకేందర్ ను చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ తర్వాత గాయపడిన ఉదయ్ తో పాటు మరో కానిస్టేబుల్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.