పెళ్లైన వ్యక్తితో ప్రేమ.. పెద్దలు వద్దని చెప్పడంతో ప్రియుడితో కలిసి

పెళ్లైన వ్యక్తితో ప్రేమ.. పెద్దలు వద్దని చెప్పడంతో ప్రియుడితో కలిసి

శ్రీకాంత్, అంజనా డిగ్రీ చదువుతున్నారు. అంజనా చాలా అందగత్తె. హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోదు. శ్రీకాంత్‌కు పెళ్లైంది. ఈ విషయం అంజనాకు కూడా తెలుసు. అయినప్పటికీ అతడితో కలిసి తిరిగింది.. చివరకు

శ్రీకాంత్, అంజనా డిగ్రీ చదువుతున్నారు. అంజనా చాలా అందగత్తె. హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోదు. శ్రీకాంత్‌కు పెళ్లైంది. ఈ విషయం అంజనాకు కూడా తెలుసు. అయినప్పటికీ అతడితో కలిసి తిరిగింది.. చివరకు

పిల్లలకు కావాల్సిన కొని తెచ్చే తల్లిదండ్రులు.. తాము ఒకరిని ప్రేమించాం.. వారితో కలిసి జీవించాలని అనుకుంటున్నామని చెబితే.. ససేమీరా అంటున్నారు. కులం, మతం అంటూ గోడలు కట్టి.. వారి ప్రేమను సమాధి చేస్తున్నారు. ప్రపంచం ముందుకు వెళుతున్నా.. పిల్లల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం లేదు కొంత మంది పేరెంట్స్. మరికొందరు.. కూతురు ఛాయిస్ కరెక్ట్ కాదని, అతడు ఎలాంటి వాడో తెలియకుండా ప్రేమించిందన్న భావనతో కూడా పెద్దలు .. ప్రేమ పెళ్లికి నిరాకరిస్తున్నారు. మరికొంత మంది పరువు కోసం పాకులాడుతూ పిల్లల ప్రేమల్ని చిదిమేస్తున్నారు. దీంతో ఇద్దరం కలిసి లేనప్పుడు.. కలిసి చనిపోవాలన్న నిర్ణయానికి వచ్చి.. ప్రాణాలు తీసుకుంటున్నారు.

పెద్దల కంచెకు మరో ప్రేమ బలైంది. జులై  1 నుండి కనిపిచంకుండా పోయిన ప్రేమికులు.. చివరకు మృతదేహాలై కనిపించారు.  నైస్ రోడ్డు సమీపంలోని సరస్సులో లవర్స్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రేమను తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో యువ ప్రేమికులు సరస్సులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.  కోననకుంటె నివాసానికి చెందిన శ్రీకాంత్, తలఘట్టాపూర్ ప్రాంతానికి సమీపంలోని అంజనాపూర్ నివాసి అంజనా. శ్రీకాంత్ బీకాం చదువుతుండగా… అంజనా బీబీఐ చదువుతోంది.  వీరిద్దరూ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కాగా, శ్రీకాంత్‌కు వివాహమైంది.  అయినప్పటికీ అతడు  అంజనను లవ్ చేశాడు. కాగా, శ్రీకాంత్‌కు పెళ్లైందని తెలిసి కూడా అంజనా అతడ్ని ఇష్టపడింది.

కాగా, వీరి ప్రేమ గురించి తల్లిదండ్రులకు తెలిసింది. పెళ్లైన వాడితో ప్రేమ ఏంటీ అంటూ మందలించారు. అతడితో పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే ఇద్దరు ఒకరికి ఒకరు కలిసి జీవించలేమని భావించి.. అంజానాపూర్‌లోని తులసీపూర్ చెరువులో దగ్గరకు వెళ్లి.. చేతిలో చేయి కట్టుకుని అందులోకి దూకారు. మరణంలో కూడా తాము వేరు కాకూడదన్న ఉద్దేశంతో ఒకరి చేతిని మరొకకరు తాడుతో కట్టుకున్నారు. అనంతరం బలవన్మరణానికి పాాల్పడ్డారు. జులై 1 నుండి వీరిద్దరూ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు చెరువులో వీరి మృతదేహాలు తేలాయి. కాగా, చనిపోయే ముందు యువతి సూసైడ్ వీడియో తీసింది. అందులో‘ మా చావుకు ఎవరూ బాధ్యులు కారు. మేము కలిసి జీవించలేము. అందుకే చనిపోతున్నాం’  అని పేర్కొంది.  తొలుత సరస్సులో శ్రీకాంత్ మృతదేహం లభ్యమైంది. అతడి మృతదేహాన్ని పైకి లేపుతుండగా అంజన మృతదేహం కూడా బయటకు వచ్చింది. చేతులకు తాడు బిగించడంతో ఇద్దరి మృతదేహాలు కలిసి కనిపించాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Show comments