క్రేజీ ఫీచర్లతో యమహా నుంచి మరో స్కూటర్.. ధర కూడా తక్కువే

వాహనదారులకు మరో కొత్త స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. యమహా కంపెనీ ఫ్యాసినో ఎస్ మోడల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. స్టన్నింగ్ డిజైన్, న్యూలుక్ తో ఉన్న ఈ స్కూటర్ వాహనదారులను ఆకట్టుకుంటోంది.

వాహనదారులకు మరో కొత్త స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. యమహా కంపెనీ ఫ్యాసినో ఎస్ మోడల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. స్టన్నింగ్ డిజైన్, న్యూలుక్ తో ఉన్న ఈ స్కూటర్ వాహనదారులను ఆకట్టుకుంటోంది.

వాహన ప్రియుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త స్కూటర్లు మార్కెట్ లోకి విడుదలవుతూనే ఉన్నాయి. ఓ వైపు ఎలక్ట్రిక్ వెహికిల్స్, మరోవైపు పెట్రోల్ తో నడిచే వాహనాలు పోటాపోటీగా రిలీజ్ అవుతున్నాయి. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు అప్ డేటెడ్ వర్షన్ తో అదిరిపోయే ఫీచర్లతో టూవీలర్స్ ను రూపొందించి రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో కొత్త స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. యమహా కంపెనీ ఫ్యాసినో ఎస్ మోడల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. స్టన్నింగ్ డిజైన్, న్యూలుక్ తో ఉన్న ఈ స్కూటర్ వాహనదారులను ఆకట్టుకుంటోంది. ఈ స్కూటర్ ధర కూడా తక్కువగానే ఉంది.

యమహాకు చెందిన ఫ్యాసినో ఎస్ మోడల్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభించనున్నది. ఈ స్కూటర్ ధర రూ. 93,730, రూ.94,530గా కంపెనీ నిర్ణయించింది. బీఎస్‌-6 ప్రమాణాలకు లోబడి ఈ స్కూటర్‌ను తయారు చేసినట్లు, ముఖ్యంగా 125 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ మాడల్‌ స్మార్ట్‌ మోటర్‌ జనరేటర్‌(ఎస్‌ఎంజీ), సైలెంట్‌ స్టార్ట్‌, ఎయిర్‌-కూల్డ్‌, పనితీరు భాగుటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ స్కూటర్ ‘ఆన్సర్ బ్యాక్’ అనే ఫీచర్‌తో వస్తుంది. దీని సాయంతో యమహా మొబైల్ యాప్ ద్వారా కూడా వినియోగదారులు తమ ఫాసినో ఎస్ మోడల్ ట్రాక్ చేయొచ్చు.

ఒకసారి ఈ యాప్ యాక్టివేట్ అయిన తర్వాత స్కూటర్ లెఫ్ట్, రైట్ ఇండికేషన్స్ హారన్ సౌండ్‌తో పాటు సుమారు రెండు సెకన్ల పాటు ఆన్ బ్లింక్ అవుతాయి. ఈ కొత్త వేరియంట్ బరువు 99కిలోలు, అండర్ సీట్ స్టోరేజ్ 21 లీటర్లు ఉంటుంది. ఈ స్కూటర్ సుజుకీ, హోండా, ఆక్టీవా స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనున్నట్లు మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. కొత్త స్కూటర్ కొనాలనుకునే వారు యమహా ఫ్యాసినో ఎస్ మోడల్ ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Show comments