ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు మరో అవకాశం.. వెంటనే ధరఖాస్తు చేసుకోండి

ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు మరో అవకాశం.. వెంటనే ధరఖాస్తు చేసుకోండి

PM Ujjwala Scheme 2.0: దేశంలో మోడీ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఉజ్వల యోజన పథకన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ పథకాన్ని ఉజ్వల యోజన 2.0గా పేరు మార్చి ఉచితంగా గ్యాస్ సిలిండర్ తో పాటు సబ్సిడిని కూడా అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ పథకం కింద త గ్యాస్ కనెక్షన్ పొందేందుకు మరో అవకాశం అందింది. అనగా ఉజ్వల యోజన పథకంలో మళ్లీ  2వ దశ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ వివరాలను తెలుసుకోండి.

PM Ujjwala Scheme 2.0: దేశంలో మోడీ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఉజ్వల యోజన పథకన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ పథకాన్ని ఉజ్వల యోజన 2.0గా పేరు మార్చి ఉచితంగా గ్యాస్ సిలిండర్ తో పాటు సబ్సిడిని కూడా అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ పథకం కింద త గ్యాస్ కనెక్షన్ పొందేందుకు మరో అవకాశం అందింది. అనగా ఉజ్వల యోజన పథకంలో మళ్లీ  2వ దశ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ వివరాలను తెలుసుకోండి.

దేశంలో మోడీ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను అందిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వాటిలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కూడా ఒకటి. అయితే ఈ ఉజ్వల యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మే 1, 2016లో ప్రవేశ పెట్టారు. ఇక ఈ పథకం ద్వారా పేద,దిగువ ఆదాయ వర్గాలకు చెందిన మహిళలు కూడా ఎల్పీజీ సిలిండర్ ప్రయోజనం పొందవచ్చు. అలాగే ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళలకు గతంలో 75 లక్షల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లను అందించిన విషయం తెలిసిందే. అయితే మొదటి దశలో ఈ ప్రాజెక్ట్ కోసం రూ80 బిలియన్ల మొత్తాన్ని కేటాయించారు. ఆ తర్వాత ఈ పథకంను కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన 2.0గా పేరు మార్చబడింది.

అలా ఈ పథకం ద్వారా చిన్నచిన్న గ్రామాలకు కూడా గ్యాస్ కనెక్షన్ అందాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. పైగా ఈ ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్‌తో పాటు ప్రతినెలా సిలిండర్ పై సబ్సిడీని పొందేట్టు అందజేస్తున్నారు.తద్వారా గ్రామాల్లో నివసించే ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. ఇకపోతే ఇప్పటికే ఈ పథకం ద్వారా 1 కోటి మందికి పైగా లబ్ధిదారులు  ఉచిత గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌ను పొందారు.అయితే తాజాగా ఇప్పుడు ఈ ఉజ్వల యోజన పథకంలో ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు మరో అవకాశం అందింది. అనగా ఉజ్వల యోజన పథకంలో మళ్లీ  2వ దశ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక ఈ పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వారందరూ ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం పొందిన వెంటనే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే PMUY పథకం యొక్క అర్హత ఈ కింది జాబితాలో వివరించడం జరిగింది.

  • ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2వ దశకు దరఖాస్తు చేసుకోవడానికి మహిళలు మాత్రమే అర్హులు.
  • అలాగే దరఖాస్తు చేసుకున్న మహిళ తప్పనిసరిగా భారతీయురాలు అయిండాలి. అంతేకాకుండా 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
  • ఇక గ్రామం నుంచి దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు ఉండాలి. నగరం నుంచి దరఖాస్తుదారుడి ఆదాయం 1 లక్ష రూపాయల లోపు ఉండాలి.
  • దీంతో పాటు దరఖాస్తుదారుని కుటుంబంలోని ఇతర సభ్యులు ఈ పథకం సదుపాయాన్ని పొంది ఉండకూడదు.

 ఈ పథకం కోసం అవసరమైన పత్రం

  • ఆధార్ కార్డు
  • చిరునామా ఫ్రూప్
  • రేషన్ కార్డు
  • బ్యాంక్ పాస్ బుక్
  • ఫోను నంబరు
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో

అయితే ఈ పథకం కోసం దరఖాస్తు ప్రక్రియ

  • అధికారిక వెబ్‌సైట్ https://pmuy.gov.in/ ని సందర్శించండి.
  • దీంతో పాటుహోమ్‌పేజీలో PM Ulwala యోజన 2.0 కోసం దరఖాస్తు ఎంపికను ఎంచుకోండి.
  • ఇక  ఈ ప్రాజెక్ట్ గురించి మొత్తం సమాచారం అందులో వస్తుంది.
  • దీని తర్వాతపేజీ దిగువన ఆన్‌లైన్ పోర్టల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎంచుకోండి.
  • ఆ తర్వాత అక్కడ కనిపించే జాబితా నుంచి గ్యాస్ కంపెనీని ఎంచుకోండి.
  • ఇప్పుడు ఆపై మీ ఫోన్ నంబర్,OTPతో లాగిన్ చేయండి. అప్పుడు దరఖాస్తు ఫారమ్ వస్తుంది.
  • అందులో అడిగిన మొత్తం సమాచారాన్ని తప్పులు లేకుండా పూరించండి.
  • ఇక చివరిగామొత్తం సమాచారం సరైనదేనని ధృవీకరించిన తర్వాత, దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.
Show comments