బ్రేకింగ్: రోడ్డు ప్రమాదంలో YCP ఎమ్మెల్సీకి తీవ్ర గాయాలు.. అక్కడికక్కడే చనిపోయిన PA

ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీ టీచర్ ఎమ్మెల్సీ ఒకరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివరాలు..

ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీ టీచర్ ఎమ్మెల్సీ ఒకరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీకి చెందిన టీచర్ ఎమ్మెల్సీ ఒకరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సమయంలో ఆయన పీఏ అక్కడికక్కడే చనిపోయారు. ఆ వివరాలు.. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. చంద్రశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ పీఏ అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ప్రస్తుతం చంద్రశేఖరరెడ్డి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన గురువారం రాత్రి  విజయవాడ నుండి నెల్లూరుకు బయలుదేరారు. అయితే అర్ధరాత్రి ఎమ్మెల్యే కారు వేగంగా వెళుతుండగా ఓ లారీ అడ్డువచ్చింది. ఇదే సమయంలో లారీ టైరు పంక్చర్ కావడంతో.. అది నెమ్మదించింది. కానీ దాని వెనకాలే వున్న ఎమ్మెల్సీ కారు వేగం అదుపుకాలేదు. అదే వేగంతో దూసుకువచ్చి లారీ వెనకబాగాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖరరెడ్డి తలకు తీవ్ర గాయాలవగా ఆయన పీఏ అక్కడికక్కడే ప్రమాదం జరిగిన స్థలంలోనే మృతిచెందాడు.

కారు ప్రమాద సమయంలో ఎమ్మెల్సీతో సహా ఐదుగురు వున్నట్లు సమాచారం. గాయపడిన అందరూ నెల్లూరు అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆ సమయంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. అదే మార్గంలో వచ్చారు. ప్రమాదం గమనించిన ఆయన వెంటనే తన కారులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిని ఆస్పత్రిలో చేర్పించారు.  ప్రస్తుతం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి చికిత్స అందిస్తున్నారని… ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments