iDreamPost
android-app
ios-app

హైదరాబాద్- విజయవాడ ప్రయాణిలకు గుడ్ న్యూస్! తగ్గనున్న జర్నీ టైమ్!

  • Published Jul 13, 2024 | 12:41 PM Updated Updated Jul 13, 2024 | 12:41 PM

Hyderabad- Vijayawada Highway Expansion Works: రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ ప్రధాన నగరాలు. అంతేకాక రెండు రాష్ట్రాల రాజధానులు  కూడా ఈ రెండు నగరాలు. ఈ మార్గంలోని ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది.

Hyderabad- Vijayawada Highway Expansion Works: రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ ప్రధాన నగరాలు. అంతేకాక రెండు రాష్ట్రాల రాజధానులు  కూడా ఈ రెండు నగరాలు. ఈ మార్గంలోని ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది.

  • Published Jul 13, 2024 | 12:41 PMUpdated Jul 13, 2024 | 12:41 PM
హైదరాబాద్- విజయవాడ ప్రయాణిలకు గుడ్ న్యూస్! తగ్గనున్న జర్నీ టైమ్!

నిత్యం ఎంతో మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. కొన్ని మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉటుంది. అలాంటి మార్గాల్లో  హైదారాబాద్, విజయవాడ మార్గం ఒకటి. ఈ జాతీయ హైవేపై నిత్యం వేలాది వాహనాలు వెళ్తుంటాయి.  ఈ క్రమంలో తాజాగా విజయవాడ, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త అందింది. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులైన ఈ రెండు మహా నగరాల మధ్య జర్నీని మరింత సౌలభ్యంగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో మరో అడుగు ముందుకు పడింది. మరి.. అసలు ఆ గుడ్ న్యూస్ ఏమిటో ఇప్పుడు చూద్దాం…

రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ ప్రధాన నగరాలు. అంతేకాక రెండు రాష్ట్రాల రాజధానులు  కూడా ఈ రెండు నగరాలు. రెండు పట్టణాల మధ్య నిత్యం వేలాది మంది జర్నీ చేస్తుంటారు. ఇక మార్గంలో రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే తరచూ ఆ మార్గంలో రోడ్డు అభివృద్ధి పనులు సాగిస్తుంటాయి. తాజాగా ఈ మార్గంలో ప్రయణం చేసే ప్రజలకు కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఓ ప్లాను అమలు చేయనుంది.

Hyd Vijayawada highway

హైదరబాద్, విజయవాడ మార్గంలోని జాతీయ రహదారిని ఆరు లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేగా విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు వీలుగా జాతీయ రహదారి ప్రాధికార సంస్ధ వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ పనులకు సంబంధించి గతంలో టెండర్లు జీఎంఆర్ సంస్థ దక్కించుకుంది. అయతే ఈ ప్రాజెక్ట్ నుంచి అర్ధాంతరంగా వైదొలగడంతో దాని స్ధానంలో మరో కాంట్రాక్టర్ ను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు రూ.700 కోట్ల బడ్జెట్ తో ఈ జాతీయ రహదారిని విస్తరించేందుకు టెండర్లు పిలవబోతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ పరిధిలో 181 కి.మీ మేర ఉన్న ఈ రహదారిని గతంలో నాలుగు లైన్లుగా విస్తరించారు.  కానీ ఆరు లైన్ల విస్తరణ సాధ్యం కాలేదు. కానీ అప్పటికే భూసేకరణ జరిగిపోవడంతో ఇప్పుడు కొత్తగా భూసేకరణ చేయాల్సిన పని లేదు. ఈ క్రమంలో ఈ రహదారి విస్తరణ పనులకు డీపీఆర్ తయారీకి ఓ ప్రైవేటు సంస్ధకు పనులు అప్పగించబోతున్నారని సమాచారం. అంతా ఓకే అయితే వెంటనే పనులు కూడా ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ఈ జాతీయ రహదారి విస్తరణ పనుల్ని వేగంగా పూర్తి చేసి.. వాహనదారులకు, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం  భావించింది. ఇది పూర్తయితే ఈ మార్గం మధ్య జర్నీ టైమ్ తగ్గడంతో పాటు జర్నీ వేగం బాగా పెరగనుంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş