YCP మహిళా ఎంపీ సోదరుడికి తీవ్ర గాయాలు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు!

అరకు వైసీపీ ఎంపీ మాధవి సోదరుడు, వైసీపీ గ్రీవెన్స్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మహేష్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మహేష్ సోమవారం ఉదయం ఎంపీ ఫొటోగ్రాఫర్‌ రాముతో కలిసి శరభన్నపాలెం నుంచి కొత్తపాలెం మీదుగా ఎర్రబొమ్మలకు బైక్‌ మీద వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మహేష్‌ బైక్‌ మీద ప్రయాణం చేస్తూ ఉండగా.. మార్గ మధ్యలో కొత్తపాలేనికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఏనుగురాయి దగ్గర.. కిందకు దిగుతుండగా.. ఉన్నట్లుండి బ్రేక్‌ ఫెయిలయ్యింది. దాంతో మహేష్‌ ప్రయాణం చేస్తోన్న బైక్‌ అదుపు తప్పి.. రోడ్డు పక్కన లోతుగా ఉన్న ప్రాంతంలో పడిపోయింది.

ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో మహేష్‌ బైక్ నడుపుతున్నాడు. దాంతో యాక్సిడెంట్‌లో మహేష్ ముఖం, తలకు తీవ్రగాయాలు అయ్యాయి. అదే సమయంలో ఏర్రబొమ్మల నుంచి రామరాజుపాలెం వస్తున్న ఓ వ్యక్తి ప్రమాదాన్ని గుర్తింది.. వెంటనే ఎంపీ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. విషయం తెలిసిన వెంటనే వారు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి మహేష్‌ను నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడికి ప్రథమ చికిత్స అందించారు. అయితే ఈ ప్రమాదంలో మహేష్‌ తీవ్రంగా గాయపడటంతో అతడిని విశాఖపట్నం తరలించారు. డాక్టర్లు మహేష్‌కు వైద్యం అందిస్తున్నారు.. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఎంపీ మాధవి సోదరుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments