iDreamPost

మాంసం ప్రియులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

మాంసం ప్రియులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

తెలంగాణ సర్కార్ నాన్ వజ్ ప్రియులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లో మటన్ క్యాంటిన్లను ఏర్పాటు అడుగులు వేస్తోంది. ఇంతే కాదు.. ఈ నెల 12 న మటన్ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ ప్రభుత్వం మటన్ క్యాంటిన్లు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ప్రజలకు నాణ్యమైన మటన్ ను సరసమైన ధరలకు అందించేందుకు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 12న హైదరాబాద్ లోని శాంతినగర్ లోని ఫెడరేషన్ కార్యాలయంలో ఈ క్యాంటిన్ ను ఏర్పాటు చేయనున్నారు.

అయితే ఇక్కడ.. మటన్ బిర్యానీ, ఖీమా, పాయా, గుర్దా ఫ్రై, పత్తర్ గోష్ లతో పాటు ఇతర మాంసాహార వంటకాలు అమ్మనున్నారట. ఇక ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి ఈ మెనులో మరిన్ని వంటకాలు చేర్చే అవకాశం కూడా ఉందట. ఇంతే కాకుండా సంచార క్యాంటిన్లను సైతం ఏర్పాటు చేయనున్నారని కూడా తెలుస్తుంది. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఫిష్ క్యాంటిన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటి ఏర్పాటుతో ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. ఇందులొ చాలా రకాలైన వంటకాలు విక్రయిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి