ఏడాది కాలంగా పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆంధప్రదేశ్ సర్కార్ చొరవతో పాక్ చెరలో ఉన్న 20 మంది జాలర్లు ఈ రోజు భారత్లో అడుగుపెట్టారు. పంజాబ్లోని వాఘా సరిహద్దు వద్ద వారికి రాష్ట్ర మంత్రి మోపీదేవి వెంకటరమణ స్వాగతం పలికారు. విజయనగరం జిల్లాకు చెందిన 20 మంది మత్స్యకారులు 2018 డిసెంబర్లో అరేబియా సముద్రంలోకి వేటకు వెళ్లారు. పాక్ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ వారిని పాక్ అధికారులు నిర్బంధించారు. వారిని […]