ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఈ రోజు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అవుతారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే చివరి నిమిషంలో సీఎం జగన్ పర్యటన వాయిదా పడింది. కరోనా కష్టకాలంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం జగన్ భావించారు. […]