iDreamPost

మరోసారి లాక్‌డౌన్‌ పొడిగింపు

మరోసారి లాక్‌డౌన్‌ పొడిగింపు

భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండడంతో మరోసారి లాక్‌డౌన్‌ పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మే 4 నుంచి మే 17 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది.

దేశంలో ఇప్పటికే 35 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఎలాగైనా కరోనా ఉధృతికి కట్టడి వేయాలని లాక్‌డౌన్‌ పొడిగించాలని కేంద్ర హోమ్ శాఖ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా 35,365 మందికి కరోనా వైరస్ సోకగా, 9065 మంది వైరస్ బారినుండి కోలుకున్నారు.. కాగా 1152 మంది మృత్యువాతపడ్డారు.. కాగా రేపు ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి