iDreamPost
android-app
ios-app

జీతూ జోసెఫ్- మోహన్ లాల్ కాంబోలో ఇంట్రస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. చెమటలు పట్టిస్తుంది

మలయాళ ఇండస్ట్రీలో బెస్ట్ కాంబోల్లో ఒకటి జీతూ జోసెఫ్- మోహన్ లాల్. వీరిద్దరి కాంబోలో దృశ్యం, దృశ్యం 2 ఎంతటి పెద్ద హిట్ కొట్టాయో అందరికీ తెలుసు. ఇదే కాంబోలో ఓ క్రైమ్ థ్రిల్లర్ వచ్చింది. చూడకుంటే చూసేయండి.

మలయాళ ఇండస్ట్రీలో బెస్ట్ కాంబోల్లో ఒకటి జీతూ జోసెఫ్- మోహన్ లాల్. వీరిద్దరి కాంబోలో దృశ్యం, దృశ్యం 2 ఎంతటి పెద్ద హిట్ కొట్టాయో అందరికీ తెలుసు. ఇదే కాంబోలో ఓ క్రైమ్ థ్రిల్లర్ వచ్చింది. చూడకుంటే చూసేయండి.

జీతూ జోసెఫ్- మోహన్ లాల్ కాంబోలో ఇంట్రస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్..  చెమటలు పట్టిస్తుంది

కేరళ ప్రకృతి అందాలకే పరవశించిపోవడం కాదు.. అక్కడి చిత్రాలకు సైతం మైమరిచిపోతుంటారు తెలుగు ప్రజలు. ముఖ్యంగా మాలీవుడ్ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందిక్కడ. చిన్న లైన్‌తో సినిమా మొత్తం తీసేసి హిట్ కొట్టేస్తుంటారు. ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజై.. టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీగా నిలుస్తాయి. అందుకు ఉదాహరణ ఇటీవల వచ్చిన మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు, బ్రహ్మయుగం, గోట్-ఆడు జీవితం. మలయాళంలో తెరకెక్కించే క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఏడాదిలో ఇలాంటి సినిమాలు 5 నుండి 10 వరకు వస్తున్నాయి. ప్రేక్షకులు..వాట్ నెక్స్ట్ అనిపించేలా తెరకెక్కిస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఇప్పుడు అలాంటి ఓ మూవీని మీ కోసం సజెస్ట్ చేయబోతున్నాం. ఈ సినిమా చూడకుండా ఉంటే చూసేయండి.

జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబోలో దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఎంతటి హిట్ కొట్టాయో తెలుసు. ఇప్పుడు కాంబోలో వచ్చిన మరో మూవీ 12th మాన్. 2022లో మలయాళంలో విడుదలైన సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా 12th మాన్. ఆశీర్వాద్ సినీ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూరు నిర్మించిన ఈ సినిమాకు కె.ఆర్. కృష్ణ కుమార్‌ కథ అందించాడు. జీతూ జోసేఫ్‌ దర్శకుడు. మోహన్‌ లాల్‌, ఉన్ని ముకుందన్‌, అనుశ్రీ, అదితి రవి, రాహుల్ మాధవ్‌, లియోనా లిషాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి విడుదలైంది. 2022 మే 20న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదలైంది. జీతూ జోసెఫ్ టేకింగ్ స్కిల్ తెలిసిన వారికి ఈ సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. ఇక కథ విషయానికి వస్తే.. 11 మంది మంచి ఫ్రెండ్స్. ప్రతి విషయాన్ని తమ వాట్సప్ గ్రూపులో షేర్ చేసుకుంటూ ఉంటారు.

 అయితే ఈ ఫ్రెండ్ గ్రూపులో యానీ ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు అని డాక్టర్ ఫ్రెండ్ దగ్గర మాట తీసుకుంటుంది. అంతలో స్నేహితుల్లో ఒకరైన సిద్దు పెళ్లి జరుగుతుండగా.. అతడు ఓ రిసార్టులో పార్టీ ఏర్పాటు చేస్తాడు. అక్కడ చెప్పాలనుకుంటుంది యానీ. కానీ ఊహించని విధంగా అందరికీ ఈ విషయం ముందే తెలిసిపోతుంది. అక్కడ ఎంటర్ అవుతాడు చంద్రన్ (మోహన్ లాల్). అక్కడ ఈ ఫ్రెండ్స్, మోహన్ లాల్‌కు మధ్య చిన్న తగాదా ఏర్పడుతుంది. అంతలో ఫ్రెండ్స్ అంతా.. ఏ ఫోన్ వచ్చినా.. స్పీకర్ అన్ చేసి మాట్లాడాలని, అలాగే మేసేజ్ వచ్చినా.. గట్టిగా చదివి వినిపించాలని అనుకుంటారు. అప్పుడు సమస్యలు ఎదురౌతాయి. అంతలో మాథ్యూ భార్య షైనీ చనిపోతుంది. అంతలో ఈ కేసును మోహన్ లాల్ టేకప్ చేస్తాడు. ఇంతకు షైనీ ఎందుకు చనిపోయింది.. ఈ కేసును చంద్రన్ ఎలా డీల్ చేశాడు అనేది మిగిలిన కథ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి