iDreamPost

జనసేనకి షాక్.. వైసీపీలో చేరిన పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరీ, మరో కీలక నేత

  • Published Nov 23, 2023 | 10:25 AMUpdated Nov 23, 2023 | 10:25 AM

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ జనసేన పార్టీకి భారీ షాక్‌ తగిలింది. పవన్‌ కళ్యాణ్‌ పర్సనల్‌ సెక్రటరీతో పాటు మరో కీలక నేత వైసీపీలో చేరారు. ఆ వివరాలు..

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ జనసేన పార్టీకి భారీ షాక్‌ తగిలింది. పవన్‌ కళ్యాణ్‌ పర్సనల్‌ సెక్రటరీతో పాటు మరో కీలక నేత వైసీపీలో చేరారు. ఆ వివరాలు..

  • Published Nov 23, 2023 | 10:25 AMUpdated Nov 23, 2023 | 10:25 AM
జనసేనకి షాక్.. వైసీపీలో చేరిన పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరీ, మరో కీలక నేత

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీకి భారీ షాక్‌ తగిలింది. పవన్‌ కళ్యాణ్‌ పర్సనల్‌ సెక్రటరీతో పాటు.. ఆ పార్టీలో కీలకంగా పని చేసే మరో మహిళా నేత తాజాగా వైసీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో పార్టీలో చేరి.. కండువా కప్పుకున్నారు. ఆ వివరాలు.. జనసేనపార్టీ నేత, పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరీ సందీప్ రాయల్ తాజాగా అధికార వైసీపీలో చేరారు. ఆయనతో పాటుగా ఆ పార్టీ రాయలసీమ రీజియన్‌ సమన్వయకర్త పద్మావతి కూడా వైఎస్సార్‌సీపీలో చేరి కండువా కప్పుకున్నారు.

పవన్‌ మాటల మాయలో పడి ఆయన కోసం, జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశామన్నారు సందీప్, పద్మావతి. పవన్‌‌ను నమ్ముకుంటే తమలాగే అందరినీ నట్టేట ముంచి, రోడ్డున పడేస్తారన్నారని విమర్శించారు. తల్లిదండ్రులు ఎవరూ కూడా తమ పిల్లలని పవన్‌ వెంట పంపవద్దని ఈ సందర్భంగా వారు సూచించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తానని, రాజకీయాల్లో మార్పు తేస్తాన­ని చెప్పి.. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్‌లో అసలు నిలకడలేదన్నారు. ఆయనకు నిజంగానే ధైర్యం ఉంటే తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పా­లని డిమాండ్‌ చేశారు. పవన్‌ మాటలతో మభ్యపెడతారని.. ఆయన్ని నమ్ముకుని ఢిల్లీ లీడర్‌ కావాలనుకున్న తాను గల్లీకి కూడా కాకుండా పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు సందీప్‌ రాయల్‌.

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోకి ఈమధ్య కాలంలో వచ్చిన కోట రుక్మిణి అనే మహిళ మాటలు విని.. తనను అలానే తన తల్లి పద్మావతిని పవన్‌ రోడ్డు­కీడ్చారన్నారు. పవన్‌కు రుక్మిణి అంటే భయమని.. నాదెండ్ల మనోహర్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. పవన్‌ అహంకారి అని, ఆయన లేకుండా నాదెండ్ల మనోహర్‌ కూడా అసెంబ్లీకి వెళ్ళకూడదనుకుంటారని తెలిపారు.

నాదెండ్ల మనోహర్‌ హవాలా డబ్బును పార్టీ ఆఫీసుకు పంపి మారుస్తారంటూ ఆరోపణలు చేశారు. హైదరాబాదులో భూ కబ్జాలో ఏ 1 గా ఉన్న వ్యక్తిని పార్టీ కమిటీలో పెట్టారన్నారు. పవన్‌ టీడీపీ కోసమే పని చేస్తున్నారని.. ఏపీ రాజకీయాల్లో మాట తప్పారన్నారు. టీడీపీ పంచన చేరి కేడర్‌ని మోసం చేశారని.. పవన్‌ రాయలసీమలో బలిజల్ని తొక్కేస్తున్నారన్నారంటూ ఈ సందర్భంగా సందీప్‌ రాయల్‌ ఘాటు విమర్శలు చేశారు.

రాబోయే ఎన్నికల్లో జనసేన–టీడీపీ విజయం సాధించే ప్రసక్తేలేదని.. ఆ కూటమికి ఓటమి తప్పదన్నారు. రాష్ట్రంలో­ని బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ఎన్నో ప­థ­కాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ మరుసారి విజయం సాధించడం ఖాయమని ఈ సందర్భంగా సందీప్‌ రాయల్‌ నమ్మకం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగన్ కోసం వైఎస్సార్‌సీపీలో చేరా­మన్నారు. వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి