iDreamPost

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​.. టీమిండియాలో వాళ్లు ఆడటం ఫిక్స్!

  • Author singhj Published - 12:02 PM, Wed - 15 November 23

ప్రపంచ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్​ కోసం టీమిండియాలో కొందరు యంగ్​స్టర్స్​కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ టోర్నీలో ఐదుగురు యువ ఆటగాళ్లు ఆడటం ఫిక్స్ అని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రపంచ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్​ కోసం టీమిండియాలో కొందరు యంగ్​స్టర్స్​కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ టోర్నీలో ఐదుగురు యువ ఆటగాళ్లు ఆడటం ఫిక్స్ అని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.

  • Author singhj Published - 12:02 PM, Wed - 15 November 23
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​.. టీమిండియాలో వాళ్లు ఆడటం ఫిక్స్!

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా తిరుగులేని విధంగా డామినేట్ చేస్తోంది. ప్రత్యర్థులను చిత్తు చిత్తుగా ఓడిస్తూ ఓటమనేదే లేకుండా నాకౌట్​ను దూసుకొచ్చి అభిమానుల్లో ఎక్స్​పెక్టేషన్స్​ను అమాంతం పెంచేసింది. అయితే ఇంత వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనేలా ఉండనుంది. సెమీఫైనల్​ గండాన్ని దాటితేనే ఫైనల్​కు క్వాలిఫై అవ్వగలం కాబట్టి న్యూజిలాండ్​ను తప్పక ఓడించాల్సిందే. ఎలాంటి హడావుడి లేకుండా కూల్​గా పని చేసుకుపోతూ, ప్రత్యర్థులకు షాకిచ్చే కివీస్​తో బుధవారం రోహిత్ సేన తలపడనుంది. టోర్నీలో టీమ్ పెర్ఫార్మెన్స్, ప్లేయర్ల ఇండివిడ్యువల్ ఫామ్, వాంఖడే స్టేడియంలో రికార్డు.. ఇలా ఏ విధంగా చూసుకున్నా ఈ మ్యాచ్​లో టీమిండియానే హాట్ ఫేవరెట్​గా కనిపిస్తోంది.

వరల్డ్ కప్ సెమీస్ హిస్టరీ మాత్రం మన వైపు లేదని చెప్పాలి. గత చరిత్రను మార్చి సరికొత్త చరిత్రను రాయాల్సిన తరుణమిది. గత ప్రపంచ కప్ సెమీస్​కు రీవేంజ్ తీసుకోవాల్సిన టైమ్ వచ్చేసింది. ఫ్యాన్స్ ఆశలు నాకౌట్ స్టేజ్​లోనే కూలిపోకుండా చూడాల్సిన రెస్పాన్సిబులిటీ రోహిత్ సేనదే. బ్యాటింగ్ పరంగా కివీస్ తరఫున సంచలన ప్రదర్శన చేస్తున్న రచిన్ రవీంద్రతో జాగ్రత్తగా ఉండాలి. అతడ్ని సాధ్యమైనంత త్వరగా పెవిలియన్​కు చేరిస్తే మంచిది. రచిన్​తో పాటు మంచి ఫామ్​లో ఉన్న డారిల్ మిచెల్, డేంజరస్ బ్యాటర్ డెవిన్ కాన్వేల్లో ఏ ఇద్దరు సెటిలైనా భారత్​కు కష్టాలు తప్పవు. ఇక ఆ టీమ్​లో అతి పెద్ద ముప్పు కెప్టెన్ కేన్ విలియమ్సన్ నుంచి పొంచి ఉందని చెప్పొచ్చు.

టీమిండియాపై మంచి రికార్డు ఉన్న కేన్ మామ సెమీస్​లోనూ దాన్ని కంటిన్యూ చేసేందుకు ప్రయత్నిస్తాడు. మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్​ను క్రీజులో కుదురుకోకుండా చేయాలి. ఒకవేళ అతడు సెటిలైతే మాత్రం ఆపడం కష్టం. న్యూజిలాండ్ బౌలింగ్​లో ట్రెంట్ బౌల్ట్, మిచెల్ శాంట్నర్ చాలా కీలకం కానున్నారు. వీళ్లిద్దర్నీ బాగా ఎదుర్కొంటే రన్స్ రావడం ఈజీ అయిపోతుంది. భారత క్రికెటర్లకు వాంఖడేలో మంచి రికార్డుతో పాటు ఎన్నో మ్యాచులు ఆడిన ఎక్స్​పీరియెన్స్ ఉండటం కలిసొచ్చే అంశం. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్​కు ఇది హోమ్ గ్రౌండ్ అనేది తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ వరల్డ్ కప్​ తర్వాత ఆస్ట్రేలియా టీమ్​తో భారత్ టీ20 సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఐదు మ్యాచుల ఈ సిరీస్​లో కొందరు యంగ్​స్టర్స్​కు టీమిండియాలో చోటు ఫిక్స్ అని తెలుస్తోంది. రీసెంట్​గా జరిగిన ఆసియా గేమ్స్​లో భారత జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించిన రుతురాజ్ గైక్వాడ్​తో పాటు యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మకు టీమిండియాలో ప్లేస్ ఖాయమని క్రికెట్ వర్గాల సమాచారం. యంగ్ వికెట్ కీపర్, బ్యాటర్ జితేష్ శర్మనూ కంగారూ సిరీస్​లో ఆడించాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ అనౌన్స్ చేసే వరకు తుది జట్టుపై ఏమీ చెప్పలేం. మరి.. ఆసీస్​తో సిరీస్​లో యంగ్ క్రికెటర్స్​లో ఎవరెవర్ని ఆడిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన సిరాజ్.. అయినా టాప్​లో భారతీయుడే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి