iDreamPost

చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఓ రేంజ్ లో ఉంది!

  • Published Apr 06, 2024 | 3:11 PMUpdated Apr 06, 2024 | 3:11 PM

పై ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి, రామకృష్ణ మధ్య నిల్చొని ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తుంది. అంతేకాకుండా ఈ అమ్మాడు లేటెస్ట్ ఫోటోస్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే.

పై ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి, రామకృష్ణ మధ్య నిల్చొని ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తుంది. అంతేకాకుండా ఈ అమ్మాడు లేటెస్ట్ ఫోటోస్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే.

  • Published Apr 06, 2024 | 3:11 PMUpdated Apr 06, 2024 | 3:11 PM
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఓ రేంజ్ లో ఉంది!

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వింటే చాలు ఇండస్ట్రీలో ఏదో తెలియని వైబ్రేషన్స్. ఇక ఈయన నుంచి సినిమా వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్ కు పునకాలే. ఎన్నో ఆద్భుతమైన సినిమాల్లో తనదైన నటనతో, డ్యాన్స్ తో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు చిరంజీవి. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా.. సినిమాల్లో మెగస్టార్ గా ఎదగడమంటే చిన్న మాట కాదు. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో నేటి ఎందరో యంగ్ స్టార్స్ కు ఆయన ఒక రోల్ మోడల్. అలాంటి గొప్ప వ్యక్తి సినిమాలో నటించే అవకాశం రావాలని అందరూ ఆశక్తిగా ఎదురు చూస్తారు. మరి ఆయన సినిమాలో ఆయన పక్కన నటించే అవకాశం దొరికితే.. ఇక ఇండస్ట్రీలో వారికి తిరుగేలేదు.

ఇప్పటికే చిరంజీవి సినిమాలో నటించిన నటులు, చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న విషయం తెలిసిందే. అలాగే పై ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఈ చిన్నారి మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి సినిమాలో ఓ పాత్ర లో నటించింది. అయితే అంజి సినిమాను లెజండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ 2004 జనవరి 15న తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ గా నమృతా శిరోద్కర్ నటించారు. అయితే అప్పటిలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. ఆ సినిమాలోని గ్రాఫిక్స్ చిన్న నుంచి పెద్ద వరకు అందరినీ ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మరి, ఇంతకి అంజి సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

పై ఫోటో మెగాస్టార్ చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి అంజి సినిమాలో నటించింది. ఇక అంజి సినిమాకు ముందు ఈ చిన్నారి చాలా సినిమాల్లో కూడా నటించింది. ఎంతో క్యూట్ గా , ఆద్భుతంగా ప్రేక్షకులను అలరించిన ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. మరి పై ఫోటోలో ఇద్దరి స్టార్స్ మధ్యన కనిపిస్తున్న ఈ చిన్నారి మరెవరో కాదు.. ‘నిత్యాశెట్టి’. కేవలం చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన బేబీ నిత్యాశెట్టి ఇప్పుడు వెండితెర పై హీరోయిన్ గా మారింది. ఇక హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే.. నిజంగా ఒకప్పుడు అంజి సినిమాల్లో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఈమె ఒకరేనా.. అని ఆశ్చర్యపోవల్సిందే. అంతలా తన అంతలా తన అంద చందాలతో ఈ బ్యూటీ అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో తన గ్లామరెస్ ఫోటోస్ తో కుర్రాళ్ల హృదయాలను దోచేస్తుంది.

ఇక నిత్య శెట్టి.. అంజి సినిమాతో పాటు దేవుళ్ళు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసినా ఈ బ్యూటీ నువ్వు తోపురా అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే వరుసగా.. ‘ఓ పిట్టకథ’, ‘వాంటెడ్’, ‘పండుగాడు’ వంటి చిత్రాల్లో నటించింది. కానీ, ఆ సినిమాలేవి ఈ అమ్మాడుకి ఆశించిన స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టాలేకపోయాయి. మరి ఇప్పుడు నిత్యాశెట్టి లేటెస్ట్ ఫోటోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ నిత్యా చాలా అందంగా ఉందంటూ.. కామెంట్స్ పెడుతున్నారు. మరి, చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న నిత్యాశెట్టి చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Nitya Shetty (@nityashettyoffl)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి