iDreamPost

OTT పార్ట్నర్ ను లాక్ చేసుకున్న గాండీవధారి అర్జున!

  • Author Soma Sekhar Published - 03:03 PM, Sat - 26 August 23
  • Author Soma Sekhar Published - 03:03 PM, Sat - 26 August 23
OTT పార్ట్నర్ ను లాక్ చేసుకున్న గాండీవధారి అర్జున!

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ సాక్షి వైద్య జంటగా నటించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ మూవీకి దర్శకత్వం వహించగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే వరుణ్ ఫ్యాన్స్ కు మాత్రం బాగా నచ్చింది ఈ మూవీ. మదర్ సెంటిమెంట్, భారీ యాక్షన్ సీన్స్, హాలీవుడ్ రేంజ్ లో టేకింగ్, వరుణ్ నటన మరో లెవల్ అంటున్నారు ఫ్యాన్స్. తాజాగా తన ఓటీటీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకుంది
‘గాండీవధారి అర్జున’. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? ఎప్పటి నుంచి అవుతుందో? ఇప్పుడు తెలుసుకుందాం.

డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు హాలీవుడ్ రేంజ్ మేకింగ్ తో తెరకెక్కించిన చిత్రం గాండీవధారి అర్జున. మెగా హీరో వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా నటించగా.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేటర్ల వద్ద డివైడ్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ. కానీ వరుణ్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ మూవీ బాగా నచ్చేసింది. దానికి కారణం మదర్ సెంటి మెంట్, యాక్షన్ సీన్స్, హాలీవుడ్ రేంజ్ మేకింగ్ బాగున్నాయి అంటున్నారు ఫ్యాన్స్. కాగా.. ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ మూవీని నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ థియేటర్ల దగ్గర వస్తున్న రెస్పాన్స్ ను చూసి ముందుగానే స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వినయక చవితి అంటే సెప్టెంబర్ 19న గాండీవధారి అర్జున మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటున్నారు. ఇక ఈ మూవీలో వరుణ్, సాక్షి వైద్యలతో పాటుగా నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, రోషిణీ, అభినవ్ గోమఠం ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు మిక్కీ జె మేయర్. మరి ఇంత త్వరగా ఓటీటీలో గాండీవధారి అర్జున మూవీ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: విజయ్ దేవరకొండ అలాంటివాడు కాదు! సమంత కామెంట్స్ వైరల్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి