iDreamPost

వీడియో: నడి రోడ్డుపై వెకిలి చేష్టలు.. ఇద్దరు అమ్మాయిల్ని మధ్యలో కూర్చొబెట్టుకుని..

ఎంతో మందికి ఆదర్శంగా నిలవాల్సిన నేటి యువత.. వెకిలి, వికృత చేష్టలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఫేమస్ అయ్యేందుకు కొంత మంది యువతీ యువకులు నడి రోడ్డుపై పిచ్చి పనులు చేసి రచ్చ చేసుకుంటున్నారు. తాజాగా

ఎంతో మందికి ఆదర్శంగా నిలవాల్సిన నేటి యువత.. వెకిలి, వికృత చేష్టలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఫేమస్ అయ్యేందుకు కొంత మంది యువతీ యువకులు నడి రోడ్డుపై పిచ్చి పనులు చేసి రచ్చ చేసుకుంటున్నారు. తాజాగా

వీడియో: నడి రోడ్డుపై వెకిలి చేష్టలు.. ఇద్దరు అమ్మాయిల్ని మధ్యలో కూర్చొబెట్టుకుని..

వెర్రి వెయ్యి విధాలు అని ఊరికనే అనేలేదు పెద్దలు. ఫేమస్ అవ్వడం కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తూ జీవితాలను అభాసుపాలు చేసుకోవడమే కాదు ప్రమాదంలోకి నెడుతున్నారు. మెట్రో రైళ్లలో రొమాన్స్, డ్యాన్సులు, రైలు పట్టాలపై రీల్స్ చేయడం, రోడ్డుపై స్కిట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అంతేనా అమ్మాయిలను బండి ఎదురు భాగంలో కూర్చొబెట్టుకుని పాడు పనులు చేస్తూ వైరల్ అవుతున్నారు. ఇందులో అమ్మాయిలు కూడా తక్కువేం తినడం లేదు. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇది చూడటానికి కాస్త గుజుప్సకరంగానే ఉంది. ఇందులో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు బండిపై వెళుతున్నారు. అందులో వింత ఏముంది అనుకోకండి.. వీడియో చూస్తే మీకే అర్థమౌతుంది.

ఇద్దరు అమ్మాయిల్ని మధ్యలో కూర్చొబెట్టుకుని వెళుతున్నారు ఆ కుర్రాళ్లు. అయితే అందులో అర్థనగ్నంగా అబ్బాయిలు ఉండటం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది. కాగా, హోలీ రోజు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. హోలీ ఆడిన తర్వాత బండిపై వెళుతూ చిక్కారు  ఈ ప్రేమికులు. అందులో వెనుక ఉన్న కుర్రాడు.. ఒంటిపై ఉన్న షర్ట్ తొలగించి కనిపిస్తున్నాడు. తన ఎదురు కూర్చున్న అమ్మాయిని గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెడుతున్న దృశ్యాలు మనకు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి.  వీరికి ఎదురుగా మరో అమ్మాయి ఉండగా.. ఇంకో యువకుడు ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో నోయిడా పోలీసుల దృష్టికి చేరింది.  వెంటనే తగిన శాస్తి చేశారు.

ఈ నలుగురికి రూ. 24, 500 జరిమానా విధించారు ఉత్తరప్రదేశ్ నోయిడా పోలీసులు. కాగా, ఇటీవల కాలంలో కొంత మంది యువకులు పెడదోవ పడుతున్నారు. నడి రోడ్డుపై నలుగురు మనల్ని చూస్తున్నారన్న ఆలోచన చేయకుండా బెడ్రూంలో చేయాల్సిన పనులను బహిరంగా చేస్తూ రచ్చ చేస్తున్నారు. అమ్మాయిలు కూడా ఈ తరహా ధోరణిలో ఉండటం గమనార్హం. మొన్న హోలీ రోజు ఢిల్లీ మెట్రోలో ఇద్దరు అమ్మాయిలు రొమాంటిక్‌గా రంగులు పూసుకుంటున్న వీడియో సెగలు పుట్టించడమే కాదు.. వారిద్దర్ని విమర్శలు పాలయ్యేలా చేసింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేందుకు ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్నారు కొందరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి