iDreamPost

దారుణం: 5 ఏళ్ల చిన్నారిని నేలకేసి కొట్టిన సాధువు!

దారుణం: 5 ఏళ్ల చిన్నారిని నేలకేసి కొట్టిన సాధువు!

దేశంలో కొందరు దుర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులపై దారుణాలకు పాల్పడుతున్నారు. అత్యాచారం చేయడం, ఆపై హత్య చేయడం వంటి ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే.. ఉత్తర్ ప్రదేశ్ లో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఏ పాపం ఎరుగని ఓ 5 ఏళ్ల చిన్నారిని ఆ దుండగుడు నేలకేసి కొట్టాడు. ఈ ఘటనలో ఆ బాలుడు అక్కడికక్కడే కొట్టుమిట్టాడుతు ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ మధుర జిల్లా గోవర్థన్ పరిధిలోని గోపాల్ ఘట్ ప్రాంతం. ఇక్కడే ఓ 5 ఏళ్ల బాలుడు సోమవారం తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ కనిపించాడు. ఇదే సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సాధువు వేశంలో అక్కడికి వచ్చి ఆ బాలుడితో మాట్లాడాడు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి కోపంతో ఊగిపోయి ఆ చిన్నారిని బలంగా నేలకేసి కొట్టాడు. ఈ దాడిలో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో స్థానికులు అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరణించిన ఆ చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్నఆ చిన్నారి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ తర్వాత మృతుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఈ ఘటన కారణంగా అక్కడ ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టం చేశారు.

ఇది కూడా చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. చివరకు విషాదంగా..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి