iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో దారుణం.. మహిళపై కత్తితో దాడి!

వివిధ కారణాలతో ఆడవారిపై అఘాత్యాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై పట్టపగలే కత్తితో దాడి జరిగింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా..

వివిధ కారణాలతో ఆడవారిపై అఘాత్యాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై పట్టపగలే కత్తితో దాడి జరిగింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా..

హైదరాబాద్ లో దారుణం.. మహిళపై కత్తితో దాడి!

ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై దాడులు జరుగుతుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు చేసినా కూడా వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. వివిధ కారణాలతో ఆడవారిపై అఘాత్యాలు చోటుచేసుకుంటున్నాయి. కుటుంబం, ఆఫీస్ , పబ్లిక్ ప్రదేశాల్లో మహిళలపై దాడులు, లైంగిక వేధింపుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి తన అత్తను దారుణంగా హత్య చేశాడు. తాజాగా హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం

హైదరాబాద్ నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిమైసమ్మ ప్రాంతంల నిషా బాటి(38)అనే మహిళపై కత్తితో దాడి జరిగింది. నిషా బాటి అనే మహిళను జీవన్ ఖాన్(35) అనే వ్యక్తి కత్తితో పొడిచి దాడి చేశాడు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. నిషాకు జీవన్ కి గత కొంతకాలంగా పరిచయం ఉంది. నిషా బాటి చింతల్‌లో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నట్లు సమాచారం.  ఈ క్రమంలోనే నిషా బాటికు జీవన్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో బుధవారం గండిమైసమ్మ వద్ద నిషా కనిపించడంతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య  గొడవ పెరిగి తీవ్ర స్థాయికి చేరింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన జీవన్ ఖాన్  నిషాపై కత్తితో దాడి చేశాడు.

ఇక నిషాపై కత్తితో దాడి చేసిన జీవన్..అనంతరం అతను ఆత్మహత్యాయత్నం చేసుకునే ప్రయత్నం చేశాడు.  ఇదే సమయంలో బాధితురాలి పరిస్థితి విషమించడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న దుండిగల్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మహిళ వంటమనిషిగా, దాడి చేసిన వ్యక్తి డ్రైవర్ గా పని చేస్తున్నట్లు ప్రాథమిక సమాచారం మేరకు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి తన కుమార్తె అత్తను దారుణంగా హత్య చేశాడు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నివాసం ఉంటున్న తన కూతురిని చూడటానికి వచ్చిన జటావత్ ప్రభు (45) అనే వ్యక్తి కుటుంబ కలహాలతో క్షణికావేశంలో తన వియ్యంకురాలిని హత్య చేశాడు.  పెళ్లి జరిగినప్పటి నుంచి వరుస గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అత్తింట్లో వేధింపులు తట్టుకోలేక కూతురు పదే పదే తల్లిగారి ఇంటికి వస్తూ ఉండేది. ఆమెకు సర్ధి చెప్పి తిరిగి అత్తారింటికి పంపిచేవారు . ఈ నేపథ్యంలోనే మంగళవారం వినాయక హిల్స్ లో నివాసం ఉంటున్న తన బిడ్డను చూడటానికి ప్రభు..తన భార్యతో కలిసి వెళ్లాడు. ఆ సమయంలో కూతురు కొర్ర లలిత (50) తో మాటా మాటా పెరగడంతో విచక్షణ కోల్పోయి ప్రభు అత్తని నెట్టివేశాడు. ఆమె కింత పడిపోయిన సమయంలో అక్కడే ఉన్న ఓ సుత్తితో తలపై బలంగా బాదాడు.  దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.