iDreamPost
android-app
ios-app

పెళ్లైన కొత్తలో ఉన్నంత అందంగా లేదని భార్యను వదిలేసిన భర్త!

పెళ్లైన కొత్తలో ఉన్నంత అందంగా లేదని భార్యను వదిలేసిన భర్త!

భార్యాభర్తలు అన్నాక తిట్టుకోవడం, అప్పుడప్పుడు పోట్లాడుకోవడం సర్వసాధారణం. రాత్రి గొడవ పడి ఉదయానికల్లా మళ్లీ ఒక్కటవుతుంటారు. అయితే, పెళ్లయ్యాక కొందరి మహిళల ప్రవర్తనలో మార్పులు వస్తుంటాయి. వీటన్నిటినీ దిగమింగుకుని భర్తలు సంసారాన్ని నెట్టుకొస్తుంటారు. ఇదిలా ఉంటే.. భర్త తాగుబోతని, సంసారానికి పనికి రాడననే కారణాలతో కొందరు మహిళలు భర్తలను వదిలేసిన ఘటనలు గతంలో చాలానే చూశాయి. కానీ, తెలంగాణలో దీనికి విరుద్దంగా మరో ఘటన చోటు చేసుకుంది. భార్య అందంగా లేదని ఓ భర్త భార్యను వదిలేశాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు స్టోరీ ఏంటంటే?

తెలంగాణలోని యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం. ఇదే గ్రామంలో రాజేష్-పూజ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. కొంత కాలానికి వీరికి ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ భార్యాభర్తలు సంతోషంగా ఉంటున్నారు. కట్ చేస్తే.. ఇటీవల రాజేష్ మరో యువతిని ఇంటికి తెచ్చుకున్నాడు. నా భార్య పెళ్లైన కొత్తలో ఉన్నంత అందంగా లేదని, దీని కారణంగానే ఈ యువతిని ఇంటికి తెచ్చుకున్నానని తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య, ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. భర్త దారుణాన్ని తట్టుకోలేని పూజ.. తనపై, ఇద్దరి పిల్లలపై పెట్రోల్ పోసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు గమనించి ఆమెను రక్షించి న్యాయం జరిగేలా చూస్తామంటూ హామీ ఇచ్చారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.