టీమిండియా వరుస విజయాలు సాధిస్తుండటంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. అయితే ఇంగ్లండ్తో మ్యాచ్కు ముందు అతడ్ని ఒక సమస్య వేధిస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా వరుస విజయాలు సాధిస్తుండటంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. అయితే ఇంగ్లండ్తో మ్యాచ్కు ముందు అతడ్ని ఒక సమస్య వేధిస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వన్డే వరల్డ్ కప్-2023లో కీలక ఫైట్కు టీమిండియా రెడీ అవుతోంది. ఆడిన ఐదు మ్యాచుల్లోనూ గెలిచి ఊపు మీద ఉన్న రోహిత్ సేన.. ఈ ఆదివారం ఇంగ్లండ్తో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా సెమీస్ బెర్త్ ఖాయం అవుతుంది. వరుస పరాజయాలతో డీలాపడిన ఇంగ్లీష్ టీమ్.. ఈ మ్యాచ్లో గనుక ఓడితే సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అందుకే ఎలాగైనా భారత్ను ఓడించాలని ఆ టీమ్ అనుకుంటోంది. బౌలర్లు ఫర్వాలేదనిపిస్తున్నా బ్యాటర్లు దారుణంగా ఫెయిల్ అవుతుండటంతో ఇంగ్లండ్కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. బ్యాటర్లు మళ్లీ ఫామ్లోకి వస్తేనే టీమిండియాను ఆపడం సాధ్యం అవుతుందని అనుకుంటోంది.
ఇంగ్లండ్ బౌలర్లలో కూడా ఒకరిద్దరు మాత్రమే రాణిస్తున్నారు. ఒకవైపు ఇంగ్లీష్ టీమ్ పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒక విషయంలో ఇబ్బందులు పడుతున్నాడు. టీమిండియా ఫైనల్ ఎలెవన్లోకి ఎవర్ని తీసుకోవాలో హిట్మ్యాన్కు అర్థం కావడం లేదు. టీమ్లోకి ఛాన్స్ ఇచ్చిన ప్రతి ప్లేయర్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంజ్యురీ కారణంగా దూరమవ్వడంతో న్యూజిలాండ్తో మ్యాచ్లో అతడి ప్లేసులో సూర్యకుమార్ యాదవ్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహ్మద్ షమీ టీమ్లోకి వచ్చారు. ధర్మశాల పిచ్ పేస్కు అనుకూలిస్తుందని షమీని తీసుకున్నారు. ఆ మ్యాచ్లో సూర్య రనౌట్ అయినా.. షమి మాత్రం 5 వికెట్లతో బౌలింగ్లో అదరగొట్టాడు. దీంతో రోహిత్కు కొత్త తలనొప్పి మొదలైంది.
ఈ వరల్డ్ కప్లో మహ్మద్ షమీకి పెద్దగా అవకాశాలు రాలేదు. తొలి మ్యాచ్లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఆడించారు. ఆ తర్వాత నుంచి ఆ ప్లేస్లో శార్దూల్ను ఆడిస్తున్నారు. కానీ న్యూజిలాండ్ మీద ఛాన్స్ రావడంతో బరిలోకి దిగిన షమి ఐదు వికెట్లతో సత్తా చాటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. మెగా టోర్నీలో వేసిన తొలి బాల్కే వికెట్ తీశాడు షమి. డెత్ ఓవర్లలోనూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రన్స్ ఆపడమే గాక వికెట్లు తీశాడు. దీంతో అనవసరంగా శార్దూల్ను ఆడించారని.. ఇప్పటికైనా షమీని కంటిన్యూ చేయాలని నెట్టింట ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
బ్యాటింగ్కు పనికొస్తాడనుకొని శార్దూల్ను తీసుకున్నా బ్యాటింగ్, బౌలింగ్లో అతడు పెద్దగా చేసిందేమీ లేదు. మరోవైపు షమి ఆడిన తొలి మ్యాచులోనే దుమ్మురేపాడు. దీంతో అతడి పెర్ఫార్మెన్స్ కెప్టెన్ రోహిత్కు తలనొప్పిగా మారింది. షమీని తుది జట్టు నుంచి తీసేయడానికి టీమ్ మేనేజ్మెంట్ సాహసం చేయలేని పరిస్థితి. పిచ్ స్పిన్కు అనుకూలిస్తే అశ్విన్ను తీసుకోవాలి. కానీ షమి పెర్ఫార్మెన్స్ చూశాక అతడి బదులు సిరాజ్ను పక్కనబెట్టాల్సి ఉంటుంది. దీంతో ఈ సమస్యను రోహిత్ ఎలా పరిష్కరిస్తాడో చూడాలి. మరి.. రోహిత్కు షమి కొత్త తలనొప్పిగా మారడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆర్ధిక కష్టాల్లో దిగ్గజ క్రికెటర్! తనను ఆదుకోవాలంటూ..