iDreamPost

భారత్​తో మ్యాచ్​కు ముందు రోహిత్​పై నెదర్లాండ్స్ టీమ్ కామెంట్స్!

  • Author singhj Published - 10:50 AM, Sat - 11 November 23

వరల్డ్ కప్​లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఆఖరి లీగ్​ మ్యాచ్​లో నెదర్లాండ్స్​తో తలపడేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు భారత కెప్టెన్ రోహిత్​ శర్మపై నెదర్లాండ్స్ టీమ్ ప్లేయర్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

వరల్డ్ కప్​లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఆఖరి లీగ్​ మ్యాచ్​లో నెదర్లాండ్స్​తో తలపడేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు భారత కెప్టెన్ రోహిత్​ శర్మపై నెదర్లాండ్స్ టీమ్ ప్లేయర్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

  • Author singhj Published - 10:50 AM, Sat - 11 November 23
భారత్​తో మ్యాచ్​కు ముందు రోహిత్​పై నెదర్లాండ్స్ టీమ్ కామెంట్స్!

వన్డే వరల్డ్ కప్​-2023లో టీమిండియా హవా మామూలుగా లేదు. ఇప్పటివరకు ఆడిన ఎనిమిదికి ఎనిమిది మ్యాచుల్లోనూ విజయం సాధించి ఫుల్ జోష్​లో ఉంది భారత్. లీగ్ దశలో రోహిత్ సేన ఆడాల్సిన మ్యాచ్ మరొకటి ఉంది. ఈ ఆదివారం నెదర్లాండ్స్​తో ఆడే మ్యాచే లీగ్ స్టేజీలో భారత్​కు చివరిది. ఇప్పటికే సెమీఫైనల్​కు చేరుకున్నందున డచ్ టీమ్​తో మ్యాచ్ మంచి ప్రాక్టీస్ అనే చెప్పాలి. ఫుల్ ఫామ్​లో ఉన్న బ్యాటర్లు, బౌలర్లు.. నెదర్లాండ్స్​తో మ్యాచ్​ను ప్రాక్టీస్​గా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు చేయాలని.. ఛేజింగ్​లో అయితే టార్గెట్​ను త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నారు. ఈ మ్యాచ్​లో టీమిండియా ప్రయోగాలు చేసే ఛాన్స్ కూడా ఉంది.

నెదర్లాండ్స్​తో మ్యాచ్​లో జస్​ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ లాంటి కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్లకు రెస్ట్ ఇస్తే బెంచ్​పై ఉన్న మిగతా ఆటగాళ్లకు ఛాన్స్ దొరుకుతుంది. కోహ్లీ, బుమ్రాకు రెస్ట్ ఇస్తే.. వాళ్ల ప్లేసులో ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్​ టీమ్​లోకి రావొచ్చు. కానీ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ తీరును చూస్తుంటే విశ్రాంతిని ఇచ్చే ఉద్దేశంతో ఎవర్నీ పక్కన పెట్టేలా కనిపించడం లేదు. బౌలర్లు మంచి రిథమ్​తో బౌలింగ్ చేస్తుండటం, బ్యాటర్లు ఫుల్ స్వింగ్​లో ఉండటంతో ఇదే ఫామ్​ను కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. సౌతాఫ్రికాతో మ్యాచ్ తర్వాత ఎలాగూ వారం రెస్ట్ దొరికింది.

లీగ్ దశలో ఆడిన చాలా మ్యాచుల్లో భారత బౌలర్లు పూర్తి ఓవర్లు వేయలేదు. ప్రత్యర్థులను తక్కువ స్కోర్లకే కట్టడి చేశారు. కాబట్టి విశ్రాంతి అవసరం లేదని ద్రవిడ్-రోహిత్ భావిస్తున్నారట. గత మ్యాచ్​లో ఆడిన టీమ్ కాంబినేషన్​నే భారత్ మళ్లీ రిపీట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. నాకౌట్ మ్యాచ్​కు ముందు అందరూ తమ ఫామ్​ను కంటిన్యూ చేయాలన్నా, తప్పొప్పులను సరిదిద్దుకోవాలన్నా డచ్ టీమ్​తో మ్యాచ్​ కీలకమని భారత టీమ్ మేనేజ్​మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. డచ్ టీమ్​తో మ్యాచ్​ను పూర్తిగా సద్వినియోగం చేసుకొని.. సెమీస్​ ఫైట్​కు రెడీగా ఉన్నట్లు ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటోంది భారత్.

ఇక, మెగా టోర్నీలో సెమీస్​కు చేరుకోకపోయినా తమ ఆటతీరుతో అందరి మనుసులు గెలుచుకుంది నెదర్లాండ్స్. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్​కు షాకిచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. భారత్​తో మ్యాచ్​లోనూ గట్టి పోటీ ఇవ్వాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్​కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై డచ్ క్రికెటర్స్ కీలక కామెంట్ చేశారు. హిట్​మ్యాన్​లా బాల్​ను పర్ఫెక్ట్ టైమింగ్​తో కొట్టే ప్లేయర్​ ఇంకొకడు లేడని నెదర్లాండ్స్ ఆటగాడు బాస్ డీ లీడ్ మెచ్చుకున్నాడు. రోహిత్ నమ్మశక్యం కాని క్రికెటర్ అని.. అతడో గ్రేట్ లీడర్ అంటూ మ్యాక్స్ డౌడ్ ప్రశంసించాడు. క్రికెట్​లో బెస్ట్ ఓపెనర్లలో భారత కెప్టెన్ ఒకడని విక్రమ్​జిత్ సింగ్ పొగడ్తల్లో ముంచెత్తాడు. మరి.. రోహిత్​పై డచ్ టీమ్ ప్లేయర్స్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: శ్రీలంక క్రికెట్​కు భారీ షాక్.. ఇకపై ఆ టోర్నీల్లో ఆడకుండా బ్యాన్.. కారణం ఇదే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి