iDreamPost

శ్రీలంక క్రికెట్​కు భారీ షాక్.. ఇకపై ఆ టోర్నీల్లో ఆడకుండా బ్యాన్.. కారణం ఇదే..!

  • Author singhj Updated - 09:50 PM, Sat - 11 November 23

అసలే వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్రీలంక క్రికెట్​కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బిగ్ షాక్ ఇచ్చింది. ఇక మీదట ఆ టోర్నీల్లో ఆడకుండా సింహళ జట్టు​పై నిషేధం విధించింది.

అసలే వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్రీలంక క్రికెట్​కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బిగ్ షాక్ ఇచ్చింది. ఇక మీదట ఆ టోర్నీల్లో ఆడకుండా సింహళ జట్టు​పై నిషేధం విధించింది.

  • Author singhj Updated - 09:50 PM, Sat - 11 November 23
శ్రీలంక క్రికెట్​కు భారీ షాక్.. ఇకపై ఆ టోర్నీల్లో ఆడకుండా బ్యాన్.. కారణం ఇదే..!

వన్డే వరల్డ్ కప్-2023లో శ్రీలంక దారుణంగా పెర్ఫార్మ్ చేసింది. యువకులతో కూడిన సింహళ జట్టు సెమీస్​కు చేరుకుంటుందనే ఎక్స్​పెక్టేషన్స్ ఎవరికీ లేవు. కానీ ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి బడా టీమ్స్​కు షాక్ ఇస్తుందేమోనని అంతా అనుకున్నారు. ఇంజ్యురీల కారణంగా కొందరు ప్లేయర్లు మెగా టోర్నీకి దూరమవ్వడం, టీమ్​లో ఉన్నవాళ్లు కలసికట్టుగా రాణించకపోవడంతో లంక టీమ్ పూర్తిగా తేలిపోయింది. వరుసగా వరల్డ్ కప్ ఫైనల్స్​కు చేరుకున్న ఘనత ఉన్న జట్టు కాస్తా పసికూన మాదిరిగా ఆడటం లంక ఫ్యాన్స్​నే గాక క్రికెట్ అభిమానులను కూడా ఎంతో నిరాశకు గురిచేసిందని చెప్పొచ్చు. ఒక మ్యాచ్​లో కాకపోతే మరో మ్యాచ్​లోనైనా పుంజుకుంటుదేమోనని అనుకుంటే టోర్నీ మొత్తం చెత్తగా పెర్ఫార్మ్ చేసింది.

ఈ వరల్డ్ కప్​లో ఆడిన 9 మ్యాచుల్లో ఏడింట్లో ఓడింది శ్రీలంక. కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే గెలవగలిగింది. టోర్నీ మధ్యలో సీనియర్ ఆల్​రౌండర్ ఏంజెలో మాథ్యూస్ జట్టుతో చేరినా లంక తలరాతను మాత్రం మార్చలేకపోయాడు. అతడి టైమ్డ్ ఔట్ వరల్డ్ కప్​లో పెద్ద కాంట్రవర్సీగా మారింది. వరుస ఓటములతో సతమతమవుతున్న లంక క్రికెట్​కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ క్రికెట్ బోర్డుపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించింది. ఈ డెసిజన్​తో ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్స్​లో శ్రీలంక పాల్గొనే ఛాన్స్ లేదు. శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ఆ దేశ గవర్నమెంట్ తలదూర్చడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సొంత నిర్ణయాలను తీసుకోవడంలో, స్వచ్ఛందంగా పని చేయడంలో ఐసీసీ రూల్స్​ను లంక బోర్డు అతిక్రమించిందని తెలిసింది.

సొంతంగా డెసిజన్స్ తీసుకోకపోవడం, స్వచ్ఛందంగా పని చేయడంలో ఫెయిల్ అయినందునే లంక బోర్డుపై ఐసీసీ బ్యాన్ వేసినట్లు తెలుస్తోంది. ఐసీసీ రూల్స్ ప్రకారం క్రికెట్ బోర్డుల్లో ఆయా దేశాల జోక్యం ఉండకూడదట. గతంలో ఈ కారణంతోనే జింబాబ్వే మీద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బ్యాన్ విధించడాన్ని క్రికెట్ అనలిస్టులు గుర్తుచేస్తున్నారు. కాగా, వన్డే వరల్డ్ కప్-2023లో లంక టీమ్ దారుణమైన ఆటతీరుతో పాయింట్స్ టేబుల్​లో 9వ స్థానంలో నిలిచింది. దీంతో లంక క్రికెట్ బోర్డును రద్దు చేయాలని ఆ దేశ సర్కారు నిర్ణయం తీసుకుంది. లెజెండరీ క్రికెటర్ అర్జున రణతుంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని కూడా నియమించింది. అయితే ఆ దేశ క్రికెట్​కు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుందనే కారణంతో శ్రీలంక బోర్డును ఐసీసీ రద్దు చేసింది. మరి.. శ్రీలంక క్రికెట్ బోర్డు విషయంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: న్యూజిలాండ్‌తోనే సెమీస్ మ్యాచ్! ఆ ఒక్కడు ఆడితే మ్యాచ్ మనదే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి