iDreamPost

Rishabh Pant: ఇది ఆయన రాసిన స్క్రిప్ట్.. రిషబ్ పంత్ ఎమోషనల్ పోస్ట్!

  • Published Jul 03, 2024 | 9:47 PMUpdated Jul 03, 2024 | 9:47 PM

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు ఫుల్ జోష్​లో ఉన్నాడు. యాక్సిడెంట్ తర్వాత కమ్​బ్యాక్ ఇచ్చిన పంత్.. వరల్డ్ కప్​ను భారత్ గెలుచుకోవడంతో సంతోషంలో మునిగిపోయాడు. కప్పు నెగ్గిన టీమ్​లో భాగం కావడంతో విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు ఫుల్ జోష్​లో ఉన్నాడు. యాక్సిడెంట్ తర్వాత కమ్​బ్యాక్ ఇచ్చిన పంత్.. వరల్డ్ కప్​ను భారత్ గెలుచుకోవడంతో సంతోషంలో మునిగిపోయాడు. కప్పు నెగ్గిన టీమ్​లో భాగం కావడంతో విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.

  • Published Jul 03, 2024 | 9:47 PMUpdated Jul 03, 2024 | 9:47 PM
Rishabh Pant: ఇది ఆయన రాసిన స్క్రిప్ట్.. రిషబ్ పంత్ ఎమోషనల్ పోస్ట్!

టీ20 వరల్డ్ కప్​ను భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న మెగాట్రోఫీని ఎట్టకేలకు కైవసం చేసుకుంది. రోహిత్ నాయకత్వంలోని టీమిండియా.. పొట్టి కప్పు ఫైనల్​లో 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. దీంతో దేశమంతటా సంబురాలు మిన్నంటాయి. భారత్ గెలుపును కోట్లాది మంది అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు. బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీమిండియా ప్లేయర్లు కూడా విన్నింగ్స్ సెలబ్రేషన్స్​లో మునిగిపోయారు. జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు ఫుల్ జోష్​లో ఉన్నాడు. యాక్సిడెంట్ తర్వాత కమ్​బ్యాక్ ఇచ్చిన పంత్.. వరల్డ్ కప్​ను భారత్ గెలుచుకోవడంతో సంతోషంలో మునిగిపోయాడు. కప్పు నెగ్గిన టీమ్​లో భాగం కావడంతో విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.

ఫైనల్​లో ప్రొటీస్​పై భారత్ విజయం సాధించగానే భావోద్వేగానికి లోనయ్యాడు పంత్. కెప్టెన్ రోహిత్ శర్మను పట్టుకొని ఏడ్చేశాడు. ఇతర ఆటగాళ్లను కౌగిలించుకొని నవ్వుతూ గెలుపును సెలబ్రేట్ చేసుకున్నాడు. కప్​ను చేతబట్టి అందరితో కలసి ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. సాధించాం.. మనమే ఛాంపియన్స్ అంటూ గట్టిగా అరుస్తూ కనిపించాడు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా పంత్ మరో ఎమోషనల్ పోస్ట్​తో వార్తల్లో నిలిచాడు. విన్నింగ్ మెడల్​తో ఉన్న ఫొటోలను అతడు ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశాడు. ఇది ఆ భగవంతుడు రాసిన స్క్రిప్ట్ అని ఆ పోస్ట్​లో రాసుకొచ్చాడు. వరల్డ్ కప్ టీమ్​లో భాగమైనందుకు ఎంతో గర్వంగా, సంతోషంగా, గొప్పగా ఉందన్నాడు.

‘చాలా గొప్పగా, గర్వంగా అనిపిస్తోంది. ఎంతో సంతోషంగానూ ఉంది. ఆ దేవుడికి తన సొంత ప్లాన్ ఒకటి ఉంది. ఈ మెడల్ నాకు ఎంతో విభిన్నమైన అనుభూతిని ఇచ్చింది’ అంటూ పంత్ తన ఇన్​స్టా పోస్ట్​లో రాసుకొచ్చాడు. అతడి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్ట్​పై అక్షర్ పటేల్​తో పాటు మహ్మద్ సిరాజ్ రియాక్ట్ అయ్యారు. అయితే వీళ్లు చాలా సరదాగా కామెంట్స్ పెట్టడం విశేషం. అచ్చం ఇలాంటి మెడలే తమ దగ్గర ఉందంటూ వాళ్లు ఫన్నీ రిప్లయ్స్ ఇచ్చారు. ఇక, మెగాటోర్నీలో పంత్ బ్యాటర్​గా, కీపర్​గా రాణించాడు. 8 మ్యాచుల్లో కలిపి అతడు 171 పరుగులు చేశాడు. వన్​డౌన్​లో వస్తూ విలువైన పరుగులు చేశాడు. దాదాపు ప్రతి మ్యాచ్​లో ఆ పొజిషన్​లో వస్తూ దూకుడైన బ్యాటింగ్​తో టీమ్​ను ఆదుకున్నాడు. అదే టైమ్​లో ఇతర జట్లను భారీ షాట్లతో భయపెట్టాడు. మరి.. పంత్ ఎమోషనల్ పోస్ట్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Rishabh Pant (@rishabpant)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి