ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ను భారత్ విక్టరీతో స్టార్ట్ చేసింది. ఈ మ్యాచ్లో సూర్య సేన విజయానికి ఐదు ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ను భారత్ విక్టరీతో స్టార్ట్ చేసింది. ఈ మ్యాచ్లో సూర్య సేన విజయానికి ఐదు ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. గురువారం వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పరుగుల వరద పారింది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్ మీద ఇరు టీమ్స్ ఆటగాళ్లు చెలరేగి బ్యాటింగ్ చేశారు. అయితే కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న సూర్యకుమార్ యాదవ్కు తోడుగా ఇషాన్ కిషన్, రింకూ సింగ్ అదరగొట్టడంతో ఈసారి గెలుపు మనదే అయింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కంగారూ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోరు చేసింది. జోష్ ఇంగ్లిస్ (110) సెంచరీతో చెలరేగగా.. స్టీవ్ స్మిత్ (53) మంచి ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన భారత్కు స్టార్టింగ్లోనే షాక్ తగిలింది. రుతురాజ్ గైక్వాడ్ (0) డైమండ్ డకౌట్గా వెనుదిరిగాడు.
రుతురాజ్ రనౌట్ కావడంతో అతడి ప్లేసులో వచ్చిన ఇషాన్ (58) తోడుగా యశస్వి జైస్వాల్ (8 బంతుల్లో 21) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. జైస్వాల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ (80)తో కలసి ఇషాన్ మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. ఆఖర్లో వీళ్లిద్దరూ పెవిలియన్కు చేరినా మిగిలిన పనిని రింకూ సింగ్ (22) ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ విజయానికి 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై టాస్ నెగ్గడం మన జట్టుకు కలిసొచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ (తేమ) ఉండే ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు సూర్య. దీంతో ఎంత టార్గెట్ ఉంటుందో ముందే ఓ అంచనాకు వచ్చి.. ఛేజింగ్లో అందుకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాలనుకున్నాడు. ఇది బాగా వర్కౌట్ అయింది.
ఈ మ్యాచ్లో భారత్ విజయానికి రెండో కారణం బౌలర్లు. వైజాగ్ పిచ్పై వికెట్లు తీయడానికి ఇరు జట్ల బౌలర్లు చాలా శ్రమించారు. బ్యాటర్లు విజృంభిస్తుండటం, గ్రౌండ్ సైజ్ కాస్త చిన్నగా ఉండటంతో అలవోకగా ఫోర్లు, సిక్సర్లు కొట్టేశారు. దీంతో వారిని ఆపేందుకు బౌలర్లు చెమటోడ్చారు. ఆసీస్ ఇన్నింగ్స్లో సెంచరీ బాదిన ఇంగ్లిస్ను తప్పితే మిగతా బ్యాటర్లను మన బౌలర్లు బాగా కంట్రోల్ చేశారు. డేంజరస్ మ్యాట్ షార్ట్ను రవి బిష్ణోయ్ స్టార్టింగ్లోనే వెనక్కి పంపాడు. ఆఖర్లో స్టొయినిస్, టిమ్ డేవిడ్ లాంటి హిట్టర్లు క్రీజులో ఉన్నా ఎక్కువ రన్స్ ఇవ్వకుండా కట్టడి చేశారు టీమిండియా బౌలర్లు. ఈ మ్యాచ్లో మన సక్సెస్కు మరో కారణం బ్యాటర్లు రాణించడం.
యంగ్ ఓపెనర్ జైస్వాల్ ఎలాంటి బెరుకు లేకుండా ఆడాడు. వచ్చిన బాల్ను వచ్చినట్టు బౌండరీకి తరలించాడు. ఉన్నంత సేపు బాగా ఆడాడు జైస్వాల్. ఇషాన్, సూర్యకు తోడు ఆఖర్లో రింకూ రాణించడంతో విజయం ఈజీ అయింది. అంత ఒత్తిడిలోనూ, ఒకవైపు వికెట్లు పడుతున్నా రింకూ కూల్గా క్రీజులో ఉండి మ్యాచ్ను ఫినిష్ చేయడం హైలైట్ అనే చెప్పాలి. భారత్ విజయంలో సూర్య కెప్టెన్సీకి కూడా క్రెడిట్ ఇవ్వాలి. బౌలింగ్ టైమ్లో బౌలర్లకు విలువైన సూచనలు ఇస్తూ కనిపించిన మిస్టర్ 360.. ఆఖరి ఓవర్లలో ఆసీస్ బ్యాటర్లను నిలువరించడంలో సక్సెస్ అయ్యాడు. బ్యాటింగ్లో తాను ఫియర్లెస్ గేమ్ ఆడటమే గాక ఇతర బ్యాటర్లతో కూడా అదే అప్రోచ్తో బ్యాటింగ్ చేయించాడు. ఇది కూడా మన విజయానికో కారణం.
ఫియర్లెస్ అప్రోచ్ కారణంగానే అంత భారీ స్కోరును కూడా ఛేజ్ చేయగలిగాం. ఈ మ్యాచ్లో టీమిండియా విజయానికి ఐదో కారణం రింకూ సింగ్ ఇన్నింగ్స్. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో ఆఖర్లో అక్షర్ పటేల్ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఇద్దరు బ్యాట్స్మెన్ రింకూకు స్ట్రయిక్ ఇచ్చేందుకు ప్రయత్నించి ఔటయ్యారు. దీంతో టీమ్పై తీవ్ర ఒత్తిడి పడింది. ఆ టైమ్లో లాస్ట్ బాల్కు సిక్స్ కొట్టి గెలిపించాడు రింకూ. అంత ప్రెజర్లోనూ కూల్గా ఉండి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. మరి.. భారత్ విజయానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు అనుకుంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆసీస్ స్టార్ బ్యాటర్లను వణికించిన టీమిండియా పేసర్! ఆ ఓవర్లో..
Rinku Singh – the finisher!
What a talent!!pic.twitter.com/PH9AHO14K2
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 23, 2023