iDreamPost
android-app
ios-app

17 మందికి 60 రూములు! పక్కనే భార్యలు! ఇంకేంటి మీరు క్రికెట్ ఆడేది: పాక్ మాజీ క్రికెటర్

  • Published Jun 20, 2024 | 5:52 PM Updated Updated Jun 20, 2024 | 5:52 PM

టీ20 వరల్డ్ కప్​-2024లో దారుణమైన ఆటతీరుతో నిరాశపర్చింది దాయాది పాకిస్థాన్. కనీసం సెమీస్​కైనా చేరుకుంటుందని భావిస్తే గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది.

టీ20 వరల్డ్ కప్​-2024లో దారుణమైన ఆటతీరుతో నిరాశపర్చింది దాయాది పాకిస్థాన్. కనీసం సెమీస్​కైనా చేరుకుంటుందని భావిస్తే గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది.

  • Published Jun 20, 2024 | 5:52 PMUpdated Jun 20, 2024 | 5:52 PM
17 మందికి 60 రూములు! పక్కనే భార్యలు! ఇంకేంటి మీరు క్రికెట్ ఆడేది: పాక్ మాజీ క్రికెటర్

టీ20 వరల్డ్ కప్​-2024లో దారుణమైన ఆటతీరుతో నిరాశపర్చింది దాయాది పాకిస్థాన్. కనీసం సెమీస్​కైనా చేరుకుంటుందని భావిస్తే గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. గత వన్డే ప్రపంచ కప్​లో ఇలాగే లీగ్ స్టేజ్​లోనే ఇంటికొచ్చేసిన బాబర్ సేన.. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ చేసింది. ఫేవరెట్ టీమిండియాతో పాటు పసికూన యూఎస్​ఏ చేతుల్లో ఓడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. పస లేని బౌలింగ్, చెత్త బ్యాటింగ్​తో అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. ఒకప్పుడు నిఖార్సయిన పేస్ బౌలింగ్, నిలకడైన బ్యాటింగ్​తో వరల్డ్ క్రికెట్​లో మోస్ట్ డేంజరస్​గా టీమ్​గా హవా నడిపించిన పాకిస్థాన్.. ఇప్పుడు పసికూనలకు కూడా భయపడే స్థితికి దిగజారడంతో తీవ్రంగా విమర్శలపాలవుతోంది. ఫ్యాన్స్​తో పాటు మాజీ క్రికెటర్లు బాబర్ సేనను ట్రోల్ చేస్తున్నారు.

వరల్డ్‌ కప్ నుంచి నిష్క్రమించిన పాక్ టీమ్​పై స్వదేశంలో ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. జట్టు ఆటగాళ్లు దేశంలోకి అడుగుపెడితే విమర్శలతో కడిగిపారేద్దామని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం సహా ఆజం ఖాన్, షాదాబ్ ఖాన్, మహ్మద్ ఆమిర్, హ్యారిస్ రౌఫ్, ఇమాద్ వసీం తదితరులు స్వదేశానికి రాకుండా యూకేకు వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది. ఓటమి బాధలో ఉన్న క్రికెటర్లు పాక్​కు వెళ్తారని అంతా అనుకుంటే.. వాళ్లు మాత్రం ఎంచక్కా కుటుంబాలతో కలసి లండన్​లో హాలీడే ట్రిప్​ను ఎంజాయ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరికొందరు ఆటగాళ్లు అమెరికాలోనే సేదతీరుతున్నట్లు సమాచారం. దీంతో మాజీ క్రికెటర్లు మరింత భగ్గుమంటున్నారు. టీమ్​లోని 17 మందికి 60 గదులు బుక్ చేసి, పక్కనే భార్యలు ఉంటే ఇంక క్రికెట్ ఏం ఆడతారని పాక్ మాజీ వికెట్ కీపర్ అతీక్ ఉజ్ జమాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

‘వీళ్లు చాలా డ్రామా చేస్తున్నారు. మేం క్రికెట్ ఆడే రోజుల్లో జట్టుతో కోచ్, మేనేజర్ ఉండేవాళ్లు. అంతా వాళ్లిద్దరే చూసుకునే వారు. కానీ ఇప్పుడు టీమ్​లోని 17 మంది ప్లేయర్లకు తోడుగా మరో 17 మంది అధికారులు. వీళ్లందరి కోసం 60 రూములు బుక్ చేయాలి. మీకు తమాషాగా ఉందా? మీరు అమెరికాకు వెళ్లింది క్రికెట్ ఆడేందుకా? లేదా హాలీడే ఎంజాయ్​మెంట్ కోసమా? అయినా ప్రపంచ కప్ వంటి మెగా టోర్నమెంట్స్​కు మీతో పాటు కుటుంబసభ్యులను తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? మ్యాచ్​ల టైమ్​లో భార్యలతో కలసి ట్రిప్స్​కు వెళ్లడం బాగా అలవాటు అయిపోయింది. భార్యాపిల్లలు.. అంతా మీతో పాటే ఉంటే గేమ్ మీద ఫోకస్ ఎలా చేస్తారు? ఛాన్స్ దొరికితే చాలు.. బయటకు వెళ్లడం ఫుడ్ తింటూ ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికే సరిపోతుంది. ఇలాంటి కల్చర్ పాక్ టీమ్​లో ఉండేది కాదు. ఇది దారుణం. క్రమశిక్షణ కొరవడింది. ఒక్కరు కూడా ఫోకస్డ్​గా కనిపించడం లేదు’ అని అతీక్ ఉజ్ జమాన్ సీరియస్ అయ్యాడు. ఏటా కోట్లకు కోట్లు ఫీజులు తీసుకుంటారు.. గానీ ఆట మాత్రం శూన్యమని విమర్శించాడు. మరి.. పాక్​ ప్లేయర్లపై అతీక్ చేసిన విమర్శల మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet