Keerthi
Madhave Madhusudana OTT: లవ్ స్టోరిలకు ఎప్పుడు యూత్ తోపాటు ఇతర వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెరకెక్కిన మూవీ మాధవే మధుసూదన. కాగా, ఈ మూవీ థియేటర్లలో విడుదలైన ఎనిమిది నెలలో తర్వాత తాజాగా ఓటీటీలో అలరించనుంది. ఇంతకి ఎక్కడంటే..
Madhave Madhusudana OTT: లవ్ స్టోరిలకు ఎప్పుడు యూత్ తోపాటు ఇతర వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెరకెక్కిన మూవీ మాధవే మధుసూదన. కాగా, ఈ మూవీ థియేటర్లలో విడుదలైన ఎనిమిది నెలలో తర్వాత తాజాగా ఓటీటీలో అలరించనుంది. ఇంతకి ఎక్కడంటే..
Keerthi
సినీ ప్రియులకు ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలి. ఇక వారి అభిరుచుల మేరకు ఈమధ్య కాలంలో రకరకాల జోనర్స్ లో వివిధ రకాల సినిమాలు, వెబ్ సిరీస్ అనేవి ఓటీటీలో అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో చూసిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్,హర్రర్ జోనర్ తరహా సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ, యూత్ ఎల్లప్పుడు మెచ్చే, నచ్చిన లవ్ స్టోరిస్ అనేవి కాస్త తగ్గయనే చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రేక్షకులు చాలాకాలం నుంచి మంచి బ్యూటీఫుల్ లవ్ స్టోరిస్ మిస్ అయ్యరనే చెప్పవచ్చు. అయితే అలాంటి వారికోసం తాజాగా మంచి లవ్ స్టోరి ఒకటి త్వరలో ఓటీటీలో అలరించబోతుంది. మరి ఆ ప్రేమ కథా చిత్రమే.. ‘మాధవే మధుసూదన’. కాగా, ఈ మూవీలో కొత్త నటీ,నటులు నటించారు. ఇకపోతే ఈ మూవీ గతేడాది నవంబర్ 24న థియేటర్లలో విడుదలైంద. అయితే సినిమా విడుదలై దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలో విడుదల కాబోతుంది. ఇంతకి ఎక్కడంటే..
లవ్ స్టోరిలకు ఎప్పుడు యూత్ తోపాటు ఇతర వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెరకెక్కిన మూవీ ‘మాధవే మధుసూదన’. కాగా, ఈ మూవీలో తేజ్ బొమ్మదేవర హీరోగా, రిషికి లొక్రే హీరోయిన్గా నటించారు. ఇకపోతే ఈ సినిమాకు సాయి రత్న క్రియేషన్స్ బ్యానర్ పై బొమ్మదేవర రామచంద్ర రావు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా గతేడాది నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక బ్యూటీఫుల్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. పైగా కొత్త నటీ, నటులు కూడా బాగా నటించారు. అలాగే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించింది. కాకపోతే ఇంతవరకు ఈ సినిమా ఓటీటీలో మాత్రం విడుదలకాలేదు. ఈ క్రమంలోనే దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. కాగా, మాధవే మధుసూదన మూవీని ఈటీవి విన్ ఓటీటీ హక్కులను విడుదల చేసుకుంది. అంతేకాకుండా.. ఈ మూవీ ఈనెలలో ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. కానీ, రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు.
ఇక మాధవే మధుసూదన కథ విషయానికొస్తే.. మాధవ్(తేజ్), అతని ఫ్రెండ్స్ రవి(జోష్ రవి), శివ(శివతేజ) ఖాళీగా అంటూ జాలిగా తిరుగేస్తుంటారు. కొడుకు ఇలా ఖాళీగా ఉండటం నచ్చక మాధవ్ తల్లి తండ్రులు బెంగుళూరులో ఉన్న ఆఫీస్ కి వెళ్లి అక్కడి పనులు చూసుకోమంటారు. అయితే బెంగుళూరు అని బయలుదేరిన మాధవ్ వైజాగ్ ట్రైన్ ఎక్కి అరకు వెళ్తాడు. ఈ ప్రయాణంలో ఓ స్టేషన్ లో మాధవ్ కి ఆరాధ్య(రిషికి లొక్రే) అనే అమ్మాయి కనిపిస్తుంది. అయితే ఆ అమ్మాయి ఎవ్వరికి కనిపించకుండా మాధవ్ కే కనిపిస్తుంది. ఆమెతో మాధవ్ ప్రేమలో పడి ఆమె వెనకాల వెళతాడు. మాధవ్ కి కనిపించిన ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయికి, మాధవ్ కి గతంలో ఉన్న సంబంధం ఏంటి? మాధవ్ ప్రేమకథ ఏమైంది? మాధవ్ వైజాగ్ ట్రైన్ ఎందుకు ఎక్కాడు అనేది తెరపై చూడాల్సిందే. మరి, ఈనెలలోమాధవే మధుసూదన మూవీ ఈటీవీ విన్ లో విడుదల కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.