OTTలోకి జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా మిస్టర్ అండ్ మిసెస్. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ అయిన రెండు నెలలు గడిచిన ఇంతవరకు ఓటీటీలోకి రాలేదు. కానీ, తాజాగా ఈ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఎక్కడంటే

బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా మిస్టర్ అండ్ మిసెస్. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ అయిన రెండు నెలలు గడిచిన ఇంతవరకు ఓటీటీలోకి రాలేదు. కానీ, తాజాగా ఈ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఎక్కడంటే

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ , టాలెంటెడ్ యాక్టర్ రాజ్ కుమార్ జంటగా ఇటీవలే నటించిన సినిమా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. అయితే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ సినిమా ఈ ఏడాది మే 31వ తేదీన థియేటర్ లో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. అంతేకాకుండా.. బాక్సాఫీస్ వద్ద  ఈ సినిమా మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. ముఖ్యంగా ఎమోషన్స్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో కనెక్ట్ అయ్యింది. పైగా ఈ సినిమాలో జాన్వీ, రాజ్ కుమార్  నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఇకపోతే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి రెండు నెలలు కావోస్తున్న ఇంతవరకు ఓటీటీలోకి అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఎప్పుడంటే

రాజ్ కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా ‘మిస్టర్ అండ్ మిసెస్’ రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. అయితే ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌ హక్కులను దక్కించుకుంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఈ మూవీ రేపు అనగా (జులై26) నుంచి నెట్‌ఫ్లిక్స్‌   ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ప్రసారం కానుంది. ఇకపోతే ఈ మిస్టర్ అండ్ మిసెస్ సినిమాను  కరణ్ జోహోర్ నిర్మాతగా వ్యహరించారు. అలాగే ఈ సినిమాలో జాన్వీ కపూర్ తో పాటు రాజ్ కుమార్ రావ్, రాజేశ్ శర్మ, కుముంద్ మిశ్రా తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

ఇక మిస్టర్ అండ్ మిసెస్ మూవీ కథ విషయానికొస్తే.. మహేంద్ర (రాజ్ కుమార్‌ రావ్‌) ఓ ఫెయిల్యూర్ క్రికెట‌ర్‌. కానీ, క్రికెట్ లో మరో ఏడాది అవకాశమిస్తే తానేంటో నిరూపించుకుంటానని తన తండ్రిని బతిమాలతాడు. అయినా సరే తండ్రి వినిపించుకోకుండా.. అతనిని స్పోర్ట్స్ షాప్ నిర్వ‌హ‌ణ బాధ్యత‌ల్ని అప్ప‌గిస్తాడు. ఇక ఆ తర్వాత మ‌హిమ అగ‌ర్వాల్ (జాన్వీ క‌పూర్‌)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అయితే మహేంద్ర తన ఫెయిల్యూర్ స్టోరీ చెప్పినప్పటికీ కూడా మహిమ అతనిని పెళ్లి చేసుకోవడానికి  అంగీకారం తెలుపుతుంది. ఎందుకంటే వైద్యురాలైన ఆమెకు క్రికెట్ అంటే చాలా పిచ్చి. అలా ఆ ఇద్దరి క్రికెట్ ప్రేమ వాళ్లని ఎక్కడికి తీసుకెళ్లింది? అనేది ఈ సినిమా కథ. మరి, ఈ విషయాలన్ని తెలుసుకోవాలంటే వెంటనే ఈ సినిమా వెంటనే ఓటీటీలో చూసేయాల్సిందే. మరీ, జాన్వీ,రాజ్ కుమార్ నటించిన మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments