iDreamPost
android-app
ios-app

పట్టపగలు దారుణం.. ఆఫీసులో అందరూ చూస్తుండగానే..!

పట్టపగలు దారుణం.. ఆఫీసులో అందరూ చూస్తుండగానే..!

విశాఖలో మరో దారుణం చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న ఓ మహిళా ఉద్యోగిపై ఓ వ్యక్తి కిరాతకానికి పాల్పడ్డాడు. ఆఫీసులో అందరి ముందే ఇలా చేయడంతో అంతా షాక్ గురవుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ క్రైమ్ స్టోరీలో అసలే జరిగిందంటే? పోలీసుల కథనం ప్రకారం.. విశాఖలోని ద్వారకానగర్ లో సుజాత అనే మహిళ నివాసం ఉంటుంది. ఈమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గతంలో ఈమెకు భర్తతో విభేదాలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి భార్యాభర్తలు వేరు వేరుగా ఉంటున్నారు.

ఇదిలా ఉంటే.. సుజాత స్థానికంగా ఉండే ఓ కంపెనీలో టెలీ కాలర్ గా చేరింది. రోజూ ఆఫీసుకు వెళ్తూ తిరిగి ఇంటికొచ్చేది. ఈ క్రమంలోనే HDFCలో రికవరీ ఏజెంట్ గా పని చేస్తున్న ఉమమహేశ్వరరావు అనే వ్యక్తి సుజాతకు పరిచయం అయినట్లుగా తెలుస్తుంది. ఇకపోతే.. ఉమమహేశ్వరరావు తాజాగా సుజాత పని చేస్తున్న ఆఫీసుకు వెళ్లాడు. అక్కడికి వెళ్లి సుజాతతో కొద్దిసేపు మాట్లాడాడు. కాగా, ఏదో విషయమై ఇద్దరు గొడవ పడ్డారు. దీంతో వెంటనే ఆ వ్యక్తి సుజాత చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసుకుని కిందకు వెళ్లిపోయాడు. ఆ మహిళ కూడా అతడి వెంటే వెళ్లింది. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన ఉమమహేశ్వరరావు ఆఫీసులో అందరి ముందే సుజాతను పొడిచాడు.

ఉద్యోగులు వెంటనే అప్రమత్తమై ఆ మహిళ వద్దకు వెళ్లి చూడగా.. అప్పటికే ఆమె రక్తపు మడుగులో పడి చనిపోయింది. ఆమె పక్కనే నిందితుడు పడిపోయి కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉమమహేశ్వరరావుని సైతం ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి