Uppula Naresh
Uppula Naresh
బతుకమ్మ, దసరా పండగల నేపధ్యంలో TSRTC ప్రయాణికులకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకు రానున్న విషయం తెలిసిందే. దీంతో పాటు దిపావళి మాదిరిగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వారికి లక్కీ డ్రా పేరుతో నగదు బహుమతులను సైతం అందిస్తామని టీఎస్ఆర్టీసీ ముందే ప్రకటించింది. అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికుల టీఎస్ఆర్టీసీ శుభవార్తను అందించింది.
ప్రయాణికులు విజ్ఞప్తి మేరకు మియాపూర్ నుంచి వెళ్లే బస్సులు జేబీఎస్ మీదుగా నడపాలంటూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే TSRTC తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ నెల 18 నుంచి బస్సులు జేబీఎస్ ను మీదుగా వెళ్లనున్నాయి. ఈ నిర్ణయంతో విజయవాడ వెళ్లే ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. దసరా పండగల నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న చాలా మంది ఇప్పటికే ఒక్కొక్కరుగా ఏపీకి పయనమవుతున్నారు.
ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని #TSRTC నిర్ణయించింది. బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి బయలుదేరే 24 సర్వీసులను ఎంజీబీఎస్ నుంచి కాకుండా జేబీఎస్ మీదుగా నడపనుంది. ఆ సర్వీసులు కేపీహెచ్ బీ కాలనీ, బాలానగర్, బోయిన్ పల్లి, జేబీఎస్,… pic.twitter.com/OY9aIdam5U
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) October 16, 2023