iDreamPost
android-app
ios-app

కొడుకుతో ధావన్.. ఇన్నాళ్ల తర్వాత ముఖంలో చిరునవ్వు

కొడుకుతో ధావన్.. ఇన్నాళ్ల తర్వాత ముఖంలో చిరునవ్వు

టీమిండియా స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ జీవితంలో మళ్లీ మధురమైన క్షణాలు చోటుచేసుకున్నాయి. ఇన్నాళ్ల తర్వాత తన కొడుకుతో వీడియో కాల్ మాట్లాడిన ధావన్ ముఖంలో చిరునవ్వు వెల్లువిరిసింది. దీనికి సంబంధించిన ఫొటోను ధావన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. కాగా ధావన్ తన భార్య అయేషా ముఖర్జీ నుంచి ఇటీవల విడాకులు పొందిన విషయం తెలిసిందే. ఒక్కగానొక్క కొడుకుతో మాట్లాడనీయకుండా, కలవనీయకుండా చేయడంతో ధావన్ మానసికంగా కృంగిపోయాడు. తన భార్య మానసికంగా వేదించడంతో ఆమె పోరు పడలేక ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశాడు ధావన్. దీనిపై విచారణ జరిపిన కోర్టు ధావన్ కు అనుకూలంగా తీర్పు వెల్లడించి విడాకులు మంజూరు చేసింది.

అప్పటికే పెళై ఇద్దరు కూతుర్లున్న అయేషాను శిఖర్ ధావన్ 2012 లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయేషా, శిఖర్ ధావన్ లకు 2014లో జోరావర్ జన్మించాడు. ఆ తర్వాత వైవాహిక జీవితంలో చోటుచేసుకున్న కలహాల వల్ల కొన్నాళ్లుగా విడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జోరావర్ ను ఆస్ట్రేలియాలో పెంచింది. ధావన్ తన కొడుకుతో మాట్లాడకుండా, కలవకుండా చేసి మానసిక వేదనకు గురిచేసింది అయేషా. ఈ క్రమంలోనే ధావన్ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కి విడాకులు పొందాడు. అంతేగాక తన కొడుకును కలిసేందుకు, అతడితో వీడియో కాల్ మాట్లాడేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలోనే తన కొడుకుతో వీడియో కాల్ మాట్లాడాడు. తండ్రిగా ఎంతగానో మురిసిపోయాడు. కొన్నళ్ల తర్వాత కొడుకుని చూసుకుని అతడితో మాట్లాడడంతో భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి