సూపర్ మూవీ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు గుర్తుపట్టాలేని విధంగా మారిపోయింది!

Super Movie, Actress: అక్కినేని నాగార్జున, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ సూపర్ గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ గుర్తుందా.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గుర్తుపట్టాలేని విధంగా మారిపోయింది.

Super Movie, Actress: అక్కినేని నాగార్జున, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ సూపర్ గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ గుర్తుందా.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గుర్తుపట్టాలేని విధంగా మారిపోయింది.

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, మాస్ డ్యాషింగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ సూపర్. ఈ మూవీ 2005లో రిలీజై సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో నాగార్జునతో పాటు సోనూసూద్ కూడా కీలక పాత్రలో మెరిశారు. అయితే ఈ సినిమాతోనే అనుష్కా శెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. కాగా, ఈ సినిమాలో అనుష్కాతో పాటు సోనూసూద్ చెల్లెలుగా మరో హీరోయిన్ కూడా నటించింది. ఇకపోతే ఆమె కూడా తెలుగు ఇండస్ట్రీకీ మొదటిసారిగా ఎంట్రీ ఇవ్వడం గమన్హారం. అయితే మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రాళ్ల క్రష్ గా మారిపోయింది ఈ బ్యూటీ. ముఖ్యంగా ఈ సినిమాలో గుచ్చి గుచ్చి చంపమాకు ఓయ్ లా పాటతో అప్పటిలో కుర్రాళ్ల మతిని పొగొట్టింది ఈ చిన్నది.మరీ ఆమె ఎవరో ఇప్పటికే గుర్తుకు పట్టేసుంటారు అనుకుంటా. మరీ, ఆమె ఎవరో కాదు.. బలీవుడ్ అందాల తార ‘అయేషా టకియా’.

సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అయేషా మొదటి సినిమాతోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. ఇకపోతే అయేషా నటించిన మొదటి సినిమా, చివరి సినిమా సూపర్ కావడం గమన్హారం. ఎందుకంటే.. అప్పటికే ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఓ స్టార్ హీరోయిన్. వరుస సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అయేషా బిజీగా మారిపోయింది. హిందీలో ఈమె నటించిన సినిమాల్లో ‘షాదీ సే పెహ్లే’,‘షాదీ నెం. 1’,‘యు హోతా తో క్యా హోతా’,‘సలామ్-ఎ-ఇష్క్’,‘డోర్ అండ్ ఫూల్’,వాంటెడ్ వంటి సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే బాలీవుడ్ లో కేరీర్ పీక్స్ లో ఉన్న ఈ చిన్నది 2009లో రాజకీయ నాయకుడు అబూ అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మీని వివాహం చేసుకుంది. కాగా, ప్రస్తుతం ఈ దంపతులకు ఒక బాబు ఉన్నాడు. ఇక పెళ్లైన తర్వాత అయేషా పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది.

అయితే ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అయితే అయేషా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ ఫొటోను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇందులో ఆమె అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.  ఎంతో అందంగా ఉన్న అయేషా.. ప్రస్తుత ఫోటోస్ చూస్తే అసలు నెటిజన్స్, ఫ్యాన్స్ ఈమె అయేషా టకియా అంటే నమ్మలేకపోతున్నారు. ఇక ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఆయేషా కాదని కొందరంటే, మరి కొందరూ మాత్రం ఆమె ముఖనికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకందని, అందుకే గుర్తుపట్టాలేనంతగా మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. మరీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అయేషా లేటెస్ట్ ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.

Show comments