iDreamPost
android-app
ios-app

బస్‌స్టాప్‌ హీరోయిన్‌ శ్రీ దివ్య గుర్తుందా?.. ఆమె ఇప్పుడు ఏం చేస్తోందంటే..

బస్‌స్టాప్‌ హీరోయిన్‌ శ్రీ దివ్య గుర్తుందా?.. ఆమె ఇప్పుడు ఏం చేస్తోందంటే..

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు శ్రీ దివ్య. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాతి కాలంలో హీరోయిన్‌గా మారారు. 2010లో వచ్చిన ‘మనసారా’ సినిమాతో హీరోయిన్‌ అయ్యారు. 2013లో వచ్చిన ‘వరుత్త పడాద వాలిబర్‌ సంఘం’ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సాధించిన విజయంతో ఆమెకు తమిళంలో మంచి మంచి అవకాశాలు వచ్చాయి. తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేశారు.

 అందం, అభినయంతో తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయారు. తమిళంలో అవకాశాలు పెరగటం.. తెలుగులో సరైన అవకాశాలు లేకపోవటంతో ఆమె తమిళ చిత్రాలకే పరిమితం అయ్యారు. 2015లో తెలుగులో కేరింత సినిమాలో ఆమె కనిపించారు. తర్వాత తమిళంలో బిజీ అయిపోయారు. అక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. తమిళంతో పాటు ఓ మలయాళ సినిమాలోనూ ఆమె నటించారు. ఆమె 2022లో వచ్చిన ‘ మోఫుసిల్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘రైడ్‌’ అనే తమిళ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది.

ఈ సినిమా తర్వాత శ్రీ దివ్య ఖాతాలో వేరే ఏ సినిమా లేదు. దీంతో ఆమె ఇంటికే పరిమితం అయ్యారు. ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ అంటూ సయయాన్ని గడుపుతున్నారు. ఇక, సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే శ్రీ దివ్య.. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు. ఫొటోలు, వీడియోల రూపంలో అందరినీ పలకరిస్తూ ఉంటారు. తాజాగా, ఆమె తన స్నేహితురాలితో స్నాక్స్‌ తింటున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Sri Divya (@sd_sridivya)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి