iDreamPost
android-app
ios-app

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే శాఖ!

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే శాఖ!

ప్రయాణికులకు రైల్వే శాఖ తాజాగా ఓ గుడ్ న్యూస్ ను అందించింది. విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను మంగళవారం నుంచి మళ్లీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఎక్స్ ప్రెస్ ఎప్పటిలాగే రైలు నెంబర్ 12805 ట్రైన్ ఉదయం 6.15 నిమిషాలకు విశాఖలో బయలు దేరుతుంది. ఇక సాయంత్రం 6.45 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అటు నుంచి 6.55కి బెగంపేటకు, రాత్రి 7.40 నిమిషాలకు లింగంపల్లి చేరుకోనుంది.

దీంతో పాటు తిరుగు ప్రయాణంలో భాగంగా 12806 లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు అక్టోబర్ 18 నుంచి ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. ఇక ఈ రైలు ఉదయం 6.15 నిమిషాలకు లింగంపల్లి నుంచి బయలుదేరి సాయంత్రం 6.38 నిమిషాలకు బేగంపేటకు చేరుకుంటుంది. ఇక సాయంత్రం అక్కడి నుంచి 7.10 నిమిషాలకు బయలుదేరి రాత్రి 7.40 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. అధికారుల ప్రకటనతో అటు నుంచి ప్రయాణించే ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి