iDreamPost
android-app
ios-app

విజృంభిస్తున్న మహమ్మారి : 24 గంటల్లో 540 మందికి వైరస్

  • Published Apr 09, 2020 | 4:03 AM Updated Updated Apr 09, 2020 | 4:03 AM
  • Published Apr 09, 2020 | 4:03 AMUpdated Apr 09, 2020 | 4:03 AM
విజృంభిస్తున్న మహమ్మారి : 24 గంటల్లో 540 మందికి వైరస్

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకి వైరస్ బారినపడే వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. గడిచిన 24 గంటల్లో 540 మందికి వైరస్ సోకిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ రోజు గురువారం ఉదయం వైద్య బులిటెన్ వెల్లడించింది. నిన్న సాయంత్రం విడుదల చేసిన బులిటెన్ లో 773 మందికి వైరస్ సోకింది తెలిపింది. మొత్తం మీద దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,734 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

తాజాగా వెల్లడైన వివరాల ప్రకారం కరోనా సోకిన వారిలో 17 మంది చనిపోయారు. దీనితో దేశంలో కరోనా మరణాలు 166 కి చేరాయి. కరోనా సోకినా చికిత్స తర్వాత 473 మంది కోలుకున్నారు. వీరిని ఆస్పతుల నుంచి వారి ఇళ్లకు పంపించారు. 5095 మంది చికిత్స పొందుతున్నారు.

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడం పై ఓకింత ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ.. పరిస్థితి ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఔషధాల కొరత లేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. హైడ్రాక్సీ క్లోరోక్వీన్ తో పాటు 24 రకాల ఔషధాల ఎగుమతుల పై విధించిన నిషేధాన్ని నిన్న మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఎత్తి వేసింది. ఈ నేపథ్యంలో లవ్ అగర్వాల్ ఔషధాల నిల్వ పై క్లారిటీ ఇచ్చారు. దేశంలో హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందుకు కొరత లేదని స్పష్టం చేశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet