iDreamPost
android-app
ios-app

శ్రీవారి సన్నిదిలో గుడ్ న్యూస్ చెప్పిన రామజోగయ్య శాస్త్రి

  • Published Aug 06, 2024 | 6:57 PM Updated Updated Aug 06, 2024 | 6:57 PM

Ramajogayya Sastry: టాలీవుడ్ సినీ రచయిత, స్టార్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారు మోగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఓ గుడ్ న్యూస్ ను ప్రకటించారు

Ramajogayya Sastry: టాలీవుడ్ సినీ రచయిత, స్టార్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారు మోగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఓ గుడ్ న్యూస్ ను ప్రకటించారు

  • Published Aug 06, 2024 | 6:57 PMUpdated Aug 06, 2024 | 6:57 PM
శ్రీవారి సన్నిదిలో గుడ్ న్యూస్ చెప్పిన రామజోగయ్య శాస్త్రి

టాలీవుడ్ సినీ రచయిత, స్టార్ లిరిక్ రైటర్ ‘రామజోగయ్య శాస్త్రి’ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎందుకంటే.. టాలీవుడ్ లోని ఈయన రాసిన ఎన్నో సాంగ్స్ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం ఈయన పేరు నెట్టింట మారు మోగుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే.. తాజాగా ఈయన యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కున ‘దేవర’ సినిమాలో ఓ పాట రాసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ పాట తారక్, జాన్వీలపై రూపొందించిన రొమాంటిక్ మెలోడి సాంగ్. ‘చుట్టమల్లే’ అనే లిరిక్స్ తో సాగిన ఈ పాట నిన్న సాయంత్రం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు.

అయితే ఈ పాటకి రామజోగయ్య శాస్త్రీ లిరిక్స్ రాయగా అనిరుద్ సంగీతం అందించడంతో మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. అదే విధంగా మరి కొంతమంది ఈ లిరిక్స్ పై నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక ఈ కామెంట్స్ పై రామ జోగయ్య శాస్త్రి తనదైన శైలిలో కౌంటర్ కూడా వేశారు. ఈ నేపథ్యంలోనే.. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సాంగ్ తో పాటు రామజోగయ్య శాస్త్రి పేరు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది.ఇక ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా రామజోగయ్య తన కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా.. ఆ స్వామివారికి మొక్కులు కూడా చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రామజోగయ్య శాస్త్రి తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇంతకీ అదేమిటంటే..

తాజాగా రామజోగయ్య శాస్త్రి  తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన  ఈ నెలలో తన కుమారుడి పెళ్లి జరగనుందని మీడియాతో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగానే.. ఈ తిరుమల స్వామివారికి మొదటి ఆహ్వాన పత్రిక అందజేసేందుకు వచ్చినట్లు మీడియాకు రామజోగయ్య శాస్త్రి తెలిపారు. కానీ, ఆ వివాహం ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందనే వివారాలు ఏవీ ఆయన వెల్లడించలేదు. కాగా, రామజోగయ్య శాస్త్రికి హర్ష, తేజ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ప్రస్తుతం రామజోగయ్య శాస్త్రి ఇంట్లో శుభకార్యం జరగనుందని చెప్పడంతో ఆయన అభిమానులు చాలా హ్యపీగా ఫీల్ అవుతున్నారు. మరీ, రామజోగయ్య శాస్త్రి ఈనెలలో తమ కుమారుడికి వివాహం చేయనున్నామని శుభవార్తను ప్రకటించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişgamdomCasibomjojobetJojobet Girişjojobet güncel giriş