iDreamPost
android-app
ios-app

Director Passed Away: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. డైరెక్టర్ ఆత్మహత్య!

  • Published Aug 06, 2024 | 11:46 AM Updated Updated Aug 06, 2024 | 11:46 AM

టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

Director Passed Away: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. డైరెక్టర్ ఆత్మహత్య!

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. వివిధ కారణాలతో నటీ, నటులు మరణిస్తున్న సంఘటనలు ఇండస్ట్రీలో చోటు చేసుకోవడం విషాదకరం. తాజాగా టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ కొమరి జానయ్య(44) ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాదకర వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కొమరి జానయ్య(44) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుకట్ పల్లిలోని భాగ్యనగర్ కాలనీలో ఉన్న ఆనంద్ ఇన్ ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, జానయ్య మరణానికి గల కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేక ఇతర రీజన్స్ వల్ల చనిపోయాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. 2021లో వచ్చిన GST(గాడ్ సైతాన్ టెక్నాలజీ) అనే చిత్రానికి జానయ్య దర్శకత్వం వహించాడు.