iDreamPost

ప్రతిరోజూ ఉదయం 3 గంటలకు ఆ పని తప్పక చేస్తా: శ్రుతిహాసన్

  • Published Jun 19, 2024 | 4:38 PMUpdated Jun 19, 2024 | 4:38 PM

Shruti Haasan: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న శ్రుతి హాసన్ తాజాగా ఓ పోస్ట్ ను షేర్ చేసింది. కాగా, అందులో అందరూ తెల్లవారుజామున పడుకుంటే నేను మాత్రం ఆ పని చేస్తుంటా అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Shruti Haasan: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న శ్రుతి హాసన్ తాజాగా ఓ పోస్ట్ ను షేర్ చేసింది. కాగా, అందులో అందరూ తెల్లవారుజామున పడుకుంటే నేను మాత్రం ఆ పని చేస్తుంటా అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Jun 19, 2024 | 4:38 PMUpdated Jun 19, 2024 | 4:38 PM
ప్రతిరోజూ ఉదయం 3 గంటలకు ఆ పని తప్పక చేస్తా:  శ్రుతిహాసన్

‘శ్రుతి హాసన్’.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ అమ్మడు పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అందుకు కారణం.. శంతన్ హాజరికాతో బ్రేకప్. గత కొన్ని రోజులు క్రితం శ్రుతి, శంతన్ వీడిపోయినట్లు రూమర్స్ వినిపించిగా.. ఆ రూమర్స్ నిజమేనంటూ వీరిద్దరూ.. అందుకు తగ్గట్టుగా డైరెక్ట్ గా స్పందించకపోయినా ఇన్ డైరెక్టర్ స్పందిస్తూ వస్తున్నారు. అనగా.. ఒకరినొకరూ ఇన్ స్టా ఆన్ ఫాలో చేసుకోవడంమే కాకుండా.. శ్రుతి హాసన్ కూడా తాను సింగల్ గానే ఉన్నానంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతూ వచ్చింది. ఇక శంతన్ తో బ్రేకప్ అయిన దగ్గర నుంచి శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. ఈ క్రమంలోనే తన ఫ్యాన్స్ కు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రుతి హాసన్ తెల్లవారు జామున 3 గంటలకు అందరూ పడుకుంటే.. తాను మాత్రం ఆ పని చేస్తానంటూ ఓ మీమ్ ను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి అదేమిటంటే..

గత కొంతకాలంగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ లో కుర్ర హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతుంది శ్రుతి హాసన్. కానీ, తన ఫర్సనల్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం  తరుచు నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంది. ముఖ్యంగా శాంతన్ తో బ్రేకప్ అయిన నుంచి శ్రుతి  తరుచు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ ను షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తెల్లవారు జామున 3 గంటలకు అందరూ పడుకుంటే.. తాను మాత్రం అలా చేస్తానంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. కాగా, శ్రుతి తాజాగా ఓ ఫన్నీ మీమ్ షేర్ చేసింది. అయితే అందులో.. తెల్లవారుజామున మూడు గంటలకు అందరూ పడుకుంటే తాను మాత్రం రీల్స్, మీమ్స్ అన్ని తన స్నేహితురాలికి షేర్ చేస్తుంటాను అని ఓ మీమ్ ను శ్రుతి హాసన్ షేర్ చేసింది.

కాగా, ప్రస్తుతం శ్రుతి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇక దీనిని చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం శంతన్ హాజారికతోనూ బ్రేకప్ అయిన బాధ నుంచి బయటపడేందుకు శ్రుతి హాసన్ ఇలా సోషల్ మీడియాలో చాలా సమయం గడుపుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రుతి హాసన్ షేర్ చేసిన ఫన్నీ మీమ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి