iDreamPost

వెంకీ,అనిల్ కాంబోలో కొత్త సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది

  • Published Jul 02, 2024 | 12:23 PMUpdated Jul 02, 2024 | 3:07 PM

టాలీవుడ్ హీరో విక్టరి వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ గతంలో ఎప్ 2, ఎప్ 3, సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబినేషన్ తాజాగా మరో కొత్త సినిమా రిలీజ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకి ఎప్పుడుంటే..

టాలీవుడ్ హీరో విక్టరి వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ గతంలో ఎప్ 2, ఎప్ 3, సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబినేషన్ తాజాగా మరో కొత్త సినిమా రిలీజ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకి ఎప్పుడుంటే..

  • Published Jul 02, 2024 | 12:23 PMUpdated Jul 02, 2024 | 3:07 PM
వెంకీ,అనిల్ కాంబోలో కొత్త సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది

అనిల్ రావిపూడి.. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లలో ఈయన కూడా ఒకరు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ ప్ర డైరెక్టర్ గా దూసుసుకపోతున్నారు అనిల్ . అంతెకాకుండా.. ఈయర తెరకెక్కించిన సినిమాలన్ని సూపర్ హిట్ అందుకోవడంతో.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ను వేసుకున్నారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి సినిమాలన్ని ఫన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. దీంతో ప్రేక్షకులు కూడా అనిల్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా అంటే చాలా ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా.. అనిల్ తన ప్రతి సినిమాలో కామెడీ, ఎమోషనల్ తో పాటు సమాజానికి ఉపాయోగపడే మంచి మెసెజ్ ను కూడా అందిస్తారు.

అయితే ఈయన చివరిగా బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో ఈయన వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తీసిన ఎప్ 2, ఎప్ 3 సినిమాలు కూడా మంచి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు దిల్ రాజు నిర్మాణ సంస్థలో రూపొందించడమే కాకుండా.. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వసూళ్లు చేశాయి. అయితే తాజాగా  మరోసారి ఈ కాంబో తెరపై రిపీట్ కావడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ వివరాలేంటో చూద్దాం.

విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో మరోసారి ఆడియన్స్ ను ఫుల్లుగా ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే  తాజాగా ఈ ఇద్దరు కలిసి మరో సినిమా చేయనున్నట్టు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ఇక ఈ సినిమా కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా.. ఈ క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేస్తూ స్పెషల్ వీడియో కేసుల విడుదల చేశారు. పైగా ఆ వీడియోలో ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్లెంట్ వైఫ్.. సారి ఎక్స్టార్డినరీ ట్రాంగులర్ క్రైం థ్రిల్లర్ తో మీ ముందుకు వస్తున్నాము. అలాగే 2025 సంక్రాంతికి కలుద్దాం అంటూ.. చెప్పుకొచ్చిన వీడియోను రిలీజ్

అయితే ఇవన్నీ చూస్తుంటే.. ఈసారి కూడా ఆడియన్స్ నుకు మంచి ఎంటర్టైన్మెంట్ సబ్జెక్టు తో కడుపుబ్బా నవ్వించడానకి సిద్ధంగా ఉన్నారని అర్ధమవుతుంది. ఇకపోతే ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. కాకపోతే ఇందులో ఐశ్వర్య రాజేష్ భార్యగా,  మీనాక్షి చౌదరి గర్ల్ ఫ్రెండ్ గా నటించనున్నారట. అయితే త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.  అలాగే ఈ సినిమాకు  భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. మరి త్వరలో వెంకీ, అనిల్, దిల్ రాజ్ కాంబినేషన్ రానున్న ఈ కొత్త సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి