iDreamPost
android-app
ios-app

గోదావరి మూవీలో సెకండ్ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా!

  • Published Aug 22, 2024 | 6:42 PM Updated Updated Aug 22, 2024 | 6:42 PM

Godavari Movie Actress: హీరో, సుమంత్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన గోదావరి అందరికీ గుర్తేండే ఉంటుంది. అయితే ఈ మూవీలో సుమంత్ మరదలుగా, పల్లెటూరి అమ్మాయిగా నటించిన ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడేలా మారిపోయిందంటే..

Godavari Movie Actress: హీరో, సుమంత్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన గోదావరి అందరికీ గుర్తేండే ఉంటుంది. అయితే ఈ మూవీలో సుమంత్ మరదలుగా, పల్లెటూరి అమ్మాయిగా నటించిన ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడేలా మారిపోయిందంటే..

  • Published Aug 22, 2024 | 6:42 PMUpdated Aug 22, 2024 | 6:42 PM
గోదావరి మూవీలో సెకండ్ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా!

తెలుగు చిత్ర పరిశ్రమలో విభన్న కథలను తెరకెక్కించిన క్లాసికల్ హిట్ అందుకున్న డైరెక్టర్స్ లో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. ముఖ్యంగా శేఖర్ కమ్ముల ఏ సినిమా తెరకెక్కించిన అందులో పాత్రలను ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దాడంలో ఈయనకు సాటి ఎవరు లేరనే చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈయన సినిమాల్ని ఫ్యామిలీ ఆడియోన్స్ మెచ్చినవి, మనుసకు ప్రశాంతత కలిగించేలా ఉంటాయి. అయితే ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అందమైన సినిమాల్లో గోదావరి కూడా ఒకటి. ఇక ఈ సినిమా ఇప్పటికి అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అనే చెప్పవచ్చు. అయితే ఈ సినిమా 2006 మే 19న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా, ఇందులో హీరోగా సుమంత్ నటించగా, హీరోయిన్ గా కమలినీ ముఖర్జీ నటించారు.ఇకపోపతే ఈ సినిమాలో సుమంత్ మరదలుగా పల్లేటూరి అమ్మాయి మరో హీరోయిన్ కూడా నటించింది ఎవరికైనా గుర్తుందా.. ఆమె ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

హీరో, సుమంత్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన గోదావరి మూవీ సుమంత్ మరదలు రాజీ పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా, చాలా సాఫ్ట్ అండ్ కూల్ గా మెరిసిన ఈ ముద్దుగుమ్మ పేరు ‘నీతూ చంద్ర’. ఈ బ్యూటీ 1984, జూన్ 20న బీహార్ లోని పాట్నాలో జన్మించింది. ఇక అక్కడే తన గ్రాడ్యూషన్ ను పూర్తి చేసిన నీతూ.. నటనపై ఆసక్తితో మోడలింగ్ వైపు అడుగులు వేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే వెండితెర పై ఆఫర్స్ నీతూ మొదట తెలుగులో 2003లో రిలీజైన ‘విష్ణువు’ అనే సినిమాలో నటించింది. దీని తర్వాత 2005లో గరం మసాలా అనే సినిమాలో నటించింది. ఇక మొదటి రెండు సినిమాల్లో తన నటనతో, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నదానికి.. 2006లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన గోదావరి సినిమాలో రాజీ పాత్రలో అవకాశం వచ్చింది. ఇలా ఈ సినిమాలో మరదలు క్యారెక్టర్ లో నటించిన నీతూ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే ఆకర్షించే అందం, అభినయం, టాలెంట్ ఉన్న ఆ తర్వాత నీతూకి తెలుగులో సరైన అవకాశాలు రాలేదు.

ఇకపోతే గోదావరి తర్వాత రెండు సినిమాలు చేసిన అవి నీతూకు అంతగా సక్సేస్ ను తెచ్చిపెట్టాలేకపోయాయి. ఈ విధంగా ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళ్, హిందీ తన మాతృభాష అయిన భోజపురి భాషాలో పలు సినిమాల్లో నటించింది. ఇక చివరిగా ఈమె 2021లోని హాలీవుడ్ నెవర్ బ్యాక్ డౌన్ అనే చిత్రంలో మెరిసింది. ఇదిలా ఉంటే.. సినిమాల్లో హీరోయిన్ గా తన అందంతో అందర్నీ ఆకట్టుకున్న నీతూ చంద్ర.. కరాటేలో ఒక బ్లాక్ బెల్డ్ అని చాలామందికి తెలియదు. ఎందుకంటే.. నీతుకు చిన్నప్పటి నుంచి కరాటే, తైక్వాండో వంటి పోరాట విద్యలంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఆ విద్యలన్ని నేర్చుకుంది. అంతేకాకుండా.. ఆ విద్యల్లో చాలా అవార్డులు, రివార్డులు అందుకుంది. ఇకపోతే నీతూ ఓ మంచి నృత్యకారిణి కూడా కావడం గమన్హారం.

ఇలా అన్ని మల్టీ టాలెంట్స్ కలిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు తెరపై కనిపించకపోయినా, కెరీర్ పరంగా నీతూ చంద్ర చాలా చాలా బిజీగా ఉందని సమాచారం.ముఖ్యంగా 2018లో ప్రో కబడ్డీ లీగ్‌లో పాట్నా పైరేట్స్‌కు నీతూ కమ్యూనిటీ అంబాసిడర్‌గా మారింది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం సినిమాల్లో అలరించకపోయిన నీతూ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన గ్లామరెస్ ఫోటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇక ఆ ఫోటోస్ నీతూ.. 42 ఏళ్ల వయసులో వన్నే తగ్గని అందంతో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె లేటెస్ట్ ఫిక్స్ వైరల్ గా మారాయి. రీ, ప్రస్తుతం గోదావరి మూవీ ఫేమ్ నీతూ చంద్ర లేటెస్ట్ ఫోటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Neetu Chandra Srivastava (@nituchandrasrivastava)