iDreamPost
android-app
ios-app

గుర్తుపట్టని విధంగా మారిపోయిన ఒకప్పటి స్టార్ హీరోయిన్.. చూస్తే ఫ్యాన్స్ తట్టుకోలేరు

  • Published May 11, 2024 | 10:19 PM Updated Updated May 11, 2024 | 10:19 PM

ఒకప్పటి అందాల తార, స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా? గుర్తుపట్టని విధంగా మారిపోయిన ఈ హీరోయిన్ పేరు తెలిస్తే ఫ్యాన్స్ షాక్ అవ్వడం ఖాయం.

ఒకప్పటి అందాల తార, స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా? గుర్తుపట్టని విధంగా మారిపోయిన ఈ హీరోయిన్ పేరు తెలిస్తే ఫ్యాన్స్ షాక్ అవ్వడం ఖాయం.

  • Published May 11, 2024 | 10:19 PMUpdated May 11, 2024 | 10:19 PM
గుర్తుపట్టని విధంగా మారిపోయిన ఒకప్పటి స్టార్ హీరోయిన్.. చూస్తే ఫ్యాన్స్ తట్టుకోలేరు

సినిమా ఇండస్ట్రీ అంటేనే వెలుగు, చీకట్ల సమ్మేళనం. ఎప్పుడు వెలుగు ఉంటుందో, ఎప్పుడు చీకటి కమ్ముకుంటుందో చెప్పలేని పరిస్థితి. అంతా బాగుంది, లైఫ్ సెట్ అనుకున్న వాళ్లకి అమాంతం కెరీర్ ముగిసిపోతుంది. అవకాశాల కోసం ఎదురుచూసేవారికి అవకాశాలు లేక కొందరు, పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమై కొందరు ఇలా చాలా మంది ఇండస్ట్రీ నుంచి ఫేడవుట్ అయిపోయారు. వారిలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూడా ఉంది. ఒకే డైరెక్టర్ తో రెండు భాషల్లో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అది కూడా కన్నడ సూపర్ స్టార్ తో ఒకటి.. రవితేజతో ఒకటి. ఆ తర్వాత నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో కలిసి నటించింది. దర్శకుడ్ని పెళ్లి చేసుకున్నాక నటనకు బ్రేకులు వేసి.. నిర్మాతగా చేసింది.

ప్రస్తుతం ఓ ఇంటర్వ్యూలో కనిపించింది. ఆ ఇంటర్వ్యూలో ఆమెను అలా చూసేసరికి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. ఒకప్పటి అందాల తార.. తన గ్లామర్ తో యువతను ఉర్రూతలూగించిన స్టార్ హీరోయిన్ గుర్తుపట్టని విధంగా మారిపోయింది. ఆమె మరెవరో కాదు రక్షిత. రవితేజ నటించిన ఇడియట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందే కన్నడలో అప్పు సినిమాతో అక్కడ ఎంట్రీ ఇచ్చింది. దాని రీమేక్ గా వచ్చిందే ఇడియట్ సినిమా. అయితే ఈ రెండు సినిమాలకు దర్శకుడు పూరీ జగన్నాథ్ కావడం విశేషం. అప్పు సినిమాలో కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించారు. ఇదే సినిమా తమిళ్ లో థమ్ గా రీమేక్ అయ్యింది. ఇందులో కూడా రక్షిత హీరోయిన్ గా నటించింది.

ఆ తర్వాత నిజం, శివమణి, ఆంధ్రావాలా, అందరివాడు వంటి సినిమాల్లో నటించింది. 2005లో జగపతి సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు. ఆ తరువాత కన్నడ సినిమాలకే పరిమితమైంది. 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ని వివాహం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత యాక్టింగ్ మానేసి నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది. జోగయ్య, డీకే, ఏక్ లవ్ యా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. హీరోయిన్ గా మానేసిన తర్వాత పలు కన్నడ టీవీ షోస్ కి హోస్ట్ గా, జడ్జిగా వ్యవహరించింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి నాటి విషయాన్ని బయటపెట్టింది. కొన్ని చోట్ల మావయ్యలే పెళ్ళికూతుర్ని మండపానికి తీసుకెళ్తారని.. అలా తనను కూడా తన మావయ్య మండపానికి తీసుకెళ్లాల్సి ఉందని తెలిపింది. మండపానికి వెళ్లేందుకు రెడీ అయ్యానని.. కానీ ఎంత సేపటికి మావయ్య రాలేదని.. ఏదో పని మీద బయటకు వెళ్లాడని తెలిసిందని చెప్పుకొచ్చింది. ఆయన వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డులు మండపం లోపలకు రానివ్వలేదని.. మా మావయ్య అనుమతించండి అని చెప్పినా వినలేదని ఆమె గుర్తు చేసుకుంది. ఆ తర్వాత ఎలాగోలా మావయ్య లోపలకు వచ్చారని.. మొత్తానికి పెళ్లి తంతు ముగిసిందని.. ఇప్పటికీ దాన్ని తలచుకుని నవ్వుకుంటామని రక్షిత చెప్పుకొచ్చింది.