iDreamPost
android-app
ios-app

ధనుష్ కావాలనే రిస్క్ చేస్తున్నాడా? వర్కవుట్ కాకపోతే పరిస్థితేంటి?

  • Author singhj Published - 04:29 PM, Thu - 9 November 23

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్​కు తమిళంతో పాటు తెలుగులోనూ అభిమాన గణం భారీగానే ఉంది. డిఫరెంట్ మూవీస్​ను ఇష్టపడే వారు ధనుష్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తుంటారు.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్​కు తమిళంతో పాటు తెలుగులోనూ అభిమాన గణం భారీగానే ఉంది. డిఫరెంట్ మూవీస్​ను ఇష్టపడే వారు ధనుష్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తుంటారు.

  • Author singhj Published - 04:29 PM, Thu - 9 November 23
ధనుష్ కావాలనే రిస్క్ చేస్తున్నాడా? వర్కవుట్ కాకపోతే పరిస్థితేంటి?

తెలుగు నాట సినిమాల సందడి ఎక్కువగా కనిపించే పండుగల్లో సంక్రాంతి ఒకటి. టాలీవుడ్​కు ఇది పెద్ద ఫెస్టివల్ సీజన్ అని చెప్పొచ్చు. దాదాపు నాల్రోజుల నుంచి వారం రోజుల వరకు ఉండే ఈ సీజన్​లో రిలీజ్ అయ్యేందుకు సినిమాలన్నీ క్యూ కడతాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు తమ చిత్రాలను సంక్రాంతి బరిలో నిలిపేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. మూవీ టాక్ ఎలా ఉన్న మినిమం కలెక్షన్లు గ్యారెంటీ కాబట్టి విడుదల తేదీ కోసం ముందే కర్చీఫ్​ వేసుకుంటారు. ఒకవేళ మంచి టాక్ వచ్చిందా వసూళ్ల జాతర చేసుకోవచ్చు.. బాగోకపోయినా మినిమం రేంజ్ కలెక్షన్లు వస్తాయనే ధీమాతోనే పొంగల్ రేసులోకి దిగేందుకు పోటీపడుతుంటారు స్టార్లు.

వచ్చే ఏడాది సంక్రాంతి రేసు మామూలుగా లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు-బిగ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ సినిమా 2024 పొంగల్​కు వస్తోంది. పండక్కి ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ అప్పుడే రిలీజ్ డేట్​ను కూడా కన్ఫర్మ్ చేసేసారు మేకర్స్. వచ్చే సంవత్సరం జనవరి 12న మహేష్ కొత్త మూవీ థియేటర్లలోకి రానుంది. అయితే ‘గుంటూరు కారం’ ఒక్కటే కాదు.. ఈ ఫిల్మ్​తో పాటు మరో 5 సినిమాలు సంక్రాంతి బరిలో ఉండనున్నాయి. ఇవి అన్నీ పెద్ద చిత్రాలే కావడం గమనార్హం. మాస్ మహారాజా ‘ఈగల్’ జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ సినిమా మీద కూడా ఆడియెన్స్​లో మంచి ఎక్స్​పెక్టేషన్స్ ఉన్నాయి.

మహేష్ బాబు, రవితేజతో పాటు విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతి బరిలో ఉన్నారు. ఆయన యాక్ట్ చేస్తున్న కొత్త చిత్రం ‘సైంధవ్’. ఈ ఫిల్మ్​ను పండక్కి తీసుకురాబోతున్నట్లు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’, కింగ్ నాగార్జున ‘నా సామిరంగ’తో పాటు ఫాంటసీ మూవీ ‘హనుమాన్’ కూడా పొంగల్​కే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ ఫిల్మ్స్ ఇంకా రిలీజ్ డేట్స్ ప్రకటించలేదు. ఇన్ని సినిమాల నడుమ ఇప్పుడు మరో మూవీ కూడా ఇదే ఫెస్టివల్​ను టార్గెట్ చేసేందుకు వస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ‘కెప్టెన్ మిల్లర్’ను 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.

‘కెప్టెన్ మిల్లర్’ మూవీకి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ కెరీర్​లోనే అత్యంత భారీ బడ్జెట్​తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 1930-40 బ్యాక్​డ్రాప్​లో రూపొందుతున్న ఈ ఫిల్మ్​లో డాక్టర్ శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్​గా నటిస్తున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ‘పుష్ప’ వంటి సినిమాలకు పనిచేసిన మదన్ కార్కీ ‘కెప్టెన్ మిల్లర్’ తమిళ వెర్షన్​కు డైలాగ్స్ అందిస్తున్నారు. తమిళంలో ధనుష్​కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్, మార్కెట్​కు పొంగల్​కు రిలీజ్ చేయడం బాగా కలిసొస్తుంది.

తమిళులకు సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి ధనుష్ మూవీకి భారీ ఓపెనింగ్స్ ఖాయం. కానీ తెలుగు నాట ఆరు పెద్ద సినిమాల నడుమ ధనుష్ చిత్రం రావడం కాస్త షాకింగ్ అనే చెప్పాలి. తెలుగునాట ఆయనకు మంచి ఇమేజ్, మార్కెట్ ఉన్నప్పటికీ పెద్ద హీరోల సినిమాలను తట్టుకొని కలెక్షన్స్ సాధించడం అంత ఈజీ కాదు. ధనుష్ కావాలనే రిస్క్ చేస్తున్నారా? అనేది అర్థం కావడం లేదు. తమిళంలో ఎలాగూ రికవరీ బాగుంటుంది కాబట్టి తెలుగు మార్కెట్ కలెక్షన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం లేదా అనేది క్లారిటీ లేదు. అయితే సినిమా బాగుంటే తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారనే నమ్మకంతోనే తీవ్ర పోటీ మధ్య కూడా ‘కెప్టెన్ మిల్లర్’ను ధనుష్ తీసుకొస్తున్నట్లు ఆయన అభిమానులు చెబుతున్నారు. మరి.. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ విషయంలో రిస్క్ తీసుకోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ‘యానిమల్’ ప్రమోషన్స్​ కోసం సందీప్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. అన్​స్టాపబుల్​కు..!

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş