iDreamPost

ఐదేళ్లైన ప్రభాస్ ఇంటి ఫుడ్ ను మర్చిపోలేకపోతున్న స్టార్ హీరోయిన్!

Prabhas, Shraddha Kapoor: ఆతిథ్యం పేరు అనగానే వెంటనే గుర్తుకొచ్చే టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన వడ్డించే ఫుడ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎంతో మంది సెలబ్రిటీలు ఏళ్లు గడుస్తున్న ఆయన పెట్టిన ఫుడ్ గురించి గుర్తుచేసుకుంటారు. అలానే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Prabhas, Shraddha Kapoor: ఆతిథ్యం పేరు అనగానే వెంటనే గుర్తుకొచ్చే టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన వడ్డించే ఫుడ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎంతో మంది సెలబ్రిటీలు ఏళ్లు గడుస్తున్న ఆయన పెట్టిన ఫుడ్ గురించి గుర్తుచేసుకుంటారు. అలానే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఐదేళ్లైన  ప్రభాస్ ఇంటి ఫుడ్ ను మర్చిపోలేకపోతున్న స్టార్ హీరోయిన్!

టాలీవుడ్ స్టార్ హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ఆయన పేరు చెప్పగానే అందరికి గుర్తుకు వచ్చేది..వారు ఇచ్చే ఆతిథ్యం. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ప్రభాస్ ఆతిథ్యం గురించి చాలా చాలా విషయాలు చెప్పారు. ఆయన షూటింగ్ ఉంటే చాలు.. అక్కడి వారందరీకి తన ఇంటి నుంచి ఫుడ్ ను తీసుకెళ్లే వారు. అలానే తనతో పాటు యాక్ట్ చేసిన నటులును ఇంటికి తీసుకెళ్లి తమ ఆతిథ్యం చూపింస్తుంటారు. అలా ప్రభాస్ వాళ్ల ఇంటి ఫుడ్ తిన్న సెలబ్రిటీలు ఇప్పటికీ చెప్పుకుంటారు. అలానే ఓ స్టార్ హీరోయిన్ కూడా ఐదేళ్లైన ప్రభాస్ ఇంటి ఫుడ్ ను మర్చిపోలేక పోతున్నారంట. ఆమె చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఇంతకీ ఆ నటి ఎవరు, ఆమె చెప్పిన విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

బాహుబలి సినిమాతో ప్రభాస్ యూనివర్సల్ స్టార్ గా మారారు. ఎందుకుంటే అంతకముందు వరకు కేవలం టాలీవుడ్ కే పరిమితమైన ప్రభాస్.. బాహుబలి లాంటి పాన్ ఇండియ మూవీతో దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. అంతేకాక ఇండియావైడ్ ఫ్యాన్స్ ను సొంతంచ సుకున్నాడు. ఇటీవలే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇది ఇలా ఉంటే  ప్రభాస్ అనగానే మరోక  విషయం గుర్తుకు వస్తుంది.  అద్భుతమైన, రుచికరమైన ఫుడ్ ప్రభాస్ పేరు వినగానే గుర్తుకు వస్తుంది.

తనతో పనిచేసే వాళ్లకు, తన తోటి వారికి తినలేనంత వివిధ రకాల ఆహార పదార్థాలను పెట్టి చంపేస్తాడంట. అందుకే ప్రభాస్ ఆతిథ్యం స్వీకరించిన వాళ్లు ఏళ్లు గడుస్తున్న సమయం వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకుంటారు. అలానే ఐదేళ్లైనా సరే ప్రభాస్ ఇంటి ఫుడ్‌ని బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ మర్చిపోలేకపోతోంది. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ సాహో మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్..డార్లింగ్ కి జోడీగా నటించింది. టాలీవుడ్ లో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం మంచి వసూళ్లు రాబట్టింది. ప్రభాస్-శ్రద్ధా కపూర్ జోడీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఈ కాంబినేషన్ మళ్లీ రీపిట్ అయితే బాగుండని చాలా మంది సినీ ప్రియులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ నెటిజన్.. ఈ విషయమై శ్రద్దా కపూర్ ని అడిగాడు. అయితే అందుకు ఆమె ఓ ఫన్నీ రిప్లయ్ ఇచ్చింది. ప్రభాస్ తో మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారని  ఓ నెటిజన్ అడగ్గా… ‘ప్రభాస్ , మళ్లీ ఎతన ఇంటి ఫుడ్ పంపించినప్పుడు’ అంటూ ఈ బ్యూటీ సమాధానం ఇచ్చింది.  వీరిద్దరు కలిసి నటించి దాదపు ఐదేళ్లు అవుతుంది. ఆ సమయంలో ప్రభాస్ శ్రద్దాకు తమ ఇంటి రుచులను పరిచయం చేశారు. అందుకే ఐదేళ్లయినా సరే ఇంకా ప్రభాస్ ఇంటి ఫుడ్‌ని శ్రద్ధా మర్చిపోలేకపోతోంది నెటిజన్లు అనుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి