iDreamPost
android-app
ios-app

భార్యపై కోపంతో కన్నబిడ్డను చంపిన తండ్రి..

భార్యపై కోపంతో కన్నబిడ్డను చంపిన తండ్రి..

భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సర్వసాధారణంగా. కలహాలు లేని కాపురాలు చాలా తక్కువగా ఉంటాయి. అలానే గొడవలు పడుతూ సర్ధుపోయే గుణం పూర్వం కాలం ఎక్కువగా ఉండేది. కానీ నేటికాలంలో భార్యాభర్తల మధ్య పంతాలు ఎక్కువ అవుతున్నాయి. ఏ స్థాయిలో అంటే.. కలహాలు వస్తే.. ఒకరినొకరు శత్రువుల కంటే ఘోరంగా చూసుకుంటారు. ఈ క్రమంలో భాగస్వామిపై కోపంతో కన్న బిడ్డలను కడతేరుస్తున్నారు కొందరు  పేరెంట్స్. తాజాగా భార్యపై కోపంతో కన్న కుమార్తెను గొంతు కోసి చంపేశాడు ఓ కసాయి తండ్రి. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని చందానగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్ లోని చందానగర్‌ ప్రాంతంలో చంద్రశేఖర్‌, హిమ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు మోక్షత అనే  ఐదేళ్ల కుమార్తె ఉంది. వీరిద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా చేస్తున్నారు. వారిమధ్య మనస్పర్థలు రావడంతో గత కొన్ని నెలలుగా చంద్రశేఖర్ హిమ విడి విడిగా ఉంటున్నారు. మోక్షజ బీహెచ్‌ఈఎల్‌లో తన తల్లి వద్ద ఉంటోంది. మోక్షజ  అక్కడే ఓ ప్రైవేటు పాఠశాల చదువుతోంది. ఈ మధ్యేనే చంద్రశేఖర్‌ ను.. అతడు పని చేస్తున్న సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది.

తన ఉద్యోగం పోవడానికి  భార్య, అత్తమామలే కారణమని భావించాడు. తాను ఉద్యోగం పోయిందని బాధలో ఉంటే.. భార్య మాత్రం సంతోషంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకుంటోందని చంద్రశేఖర్ అసహనానికి లోనయ్యాడు. ఈక్రమంలో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెకు సంతోషం లేకుండా చేయాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం మోక్షత చదువుతున్న స్కూల్ కి చంద్రశేఖర్‌ వెళ్లాడు. మాయ మాటలు చెప్పి.. పాపను కారులో ఔటర్ రింగ్ రోడ్డు వైపు తీసుకెళ్లారు. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న బ్లేడ్ తో మోక్షతను గొంతు కోసి హత్య చేశాడు. పాప డెడ్ బాడీని కనిపించకుండా చేయాలని భావించాడు. ఈ క్రమంలనే అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్దకు వెళ్లాడు.

మృతదేహాన్ని ఎక్కడ పడేయాలనే కంగారులో అదుపుతప్పి ఓఆర్ఆర్‌ వద్ద డివైడర్‌ను ఢీకొట్టాడు. అదే సమయంలో అటువైపు  పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు ప్రమాదాన్ని గుర్తించి…ఘటన స్థలానికి వెళ్లారు. అక్కడ కారు వెనక సీట్లో పాప మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు ప్రశ్నించడంతో.. తన భార్య కోపంతోనే కుమార్తెను హత్య చేసినట్లు చంద్రశేఖర్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. మరి.. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఇలా కాటు వేయడం అందరిని కలచివేసింది. మరి.. ఈ కసాయి తండ్రికి ఎలాంటి శిక్ష విధించాలో మీ  అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అందంగా కనిపిస్తున్న ఈ నర్సు మనిషి కాదు! ఏకంగా 7 మందిని..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి