Tamil Nadu Crime News: భార్యను బ్లాక్ మెయిల్ చేసిన భర్త! ఛీ.. వీడేం మనిషి రా నాయనా..!

భార్యను బ్లాక్ మెయిల్ చేసిన భర్త! ఛీ.. వీడేం మనిషి రా నాయనా..!

తమిళనాడులోని గౌండర్ పురం పాంతంలో అరుల్ మణి (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు రెండేళ్ల కిందట ఓ యువతి (21)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకున్నానని ఆ యువతి కూడా ఎంతో మురిసిపోయింది. కొంత కాలానికి వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే అరుల్ మణి దంపతుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

దీంతో అప్పటి నుంచి ఇద్దరు విడిపోయి వేరు వేరుగా కాపురాలు పెట్టారు. అయితే, ఈ క్రమంలోనే భర్త అరుల్ మణి భార్యపై కోపంతో దారుణానికి ఒడిగట్టాడు. భార్య, ఆమె తల్లి, చెల్లి ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. ఆ తర్వాత అదే ఫోటోలను తన భార్యకు పంపి.. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. ఆ సమయంలో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక ఆ యువతి స్థానిక పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇటీవల నిందితుడు అరుల్ మణిను అరెస్ట్ చేశారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Show comments