iDreamPost
android-app
ios-app

రెండేళ్ల కిందట పెళ్లి.. భర్త చేసిన పాడు పనికి భార్య బలవన్మరణం!

ఇదే విషయం ఇటీవల భార్యకు తెలిసింది. పద్దతి మార్చుకోవాలంటూ అనేక సార్లు భర్తకు చెప్పి చూసింది. అయినా.. మనోడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.

ఇదే విషయం ఇటీవల భార్యకు తెలిసింది. పద్దతి మార్చుకోవాలంటూ అనేక సార్లు భర్తకు చెప్పి చూసింది. అయినా.. మనోడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.

రెండేళ్ల కిందట పెళ్లి.. భర్త చేసిన పాడు పనికి భార్య బలవన్మరణం!

ఈ యువతి పేరు ఎర్ర నవ్య, వయసు 25 ఏళ్లు. ఈమెకు రెండున్నరేళ్ల కిందట మనోజ్ అనే యువకుడితో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అయితే, మనోజ్ భార్యతో బాగానే ఉన్నట్లు నటిస్తూ పాడు పనులకు తెర లేపాడు. ఇదే విషయం ఇటీవల భార్యకు తెలిసింది. పద్దతి మార్చుకోవాలంటూ అనేక సార్లు భర్తకు చెప్పి చూసింది. అయినా.. మనోడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక భరించలేకపోయిన ఆ వివాహిత ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఎర్ర నవీన్-నవ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండున్నరేళ్ల కిందట వివాహం జరిగింది. భర్త స్థానికంగా ఓ చోట పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా కొంత కాలం పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. మరో విషయం ఏంటంటే? మనోజ్ భార్య నవ్యకు తెలియకుండ స్థానికంగా ఉండే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయం కొన్నాళ్లకి భార్య నవ్యకు తెలిసింది. పద్దతి మార్చుకోవాలంటూ అనేకసార్లు భర్తకు చెప్పి చూసింది. కానీ, మనోడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.

ఇక రాను రాను మనోజ్ భార్యను దూరం పెడుతూ ప్రియురాలికి మరింత దగ్గరయ్యాడు. భర్త అలా చేయడంతో నవ్య తట్టుకోలేకపోయింది. ఇలాంటి బతుకు నాకు వద్దు అనుకుందో ఏమో కానీ.. గురువారం ఇంట్లో అందరూ ఉండగానే నవ్య ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న నవ్య తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.