karnataka Crime News: భర్తను కాదని ప్రియుడితో సరసాలు.. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్!

భర్తను కాదని ప్రియుడితో సరసాలు.. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్!

ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ భార్యాభర్తల వైవాహిక జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా కొంత కాలం తర్వాత ఈ దంపతులకు ఓ కూతురు జన్మించింది. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి చేరాయి. దీంతో భార్యాభర్తలు తరుచు గొడవ పడేవారు. ఇక మొగుడితో ఉండలేని ఆ మహిళ భర్తకు దూరం జరిగి ఓ ఇంట్లో అద్దెకు దిగింది. ఇదే సమయంలోనే ఆమెకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది. దీంతో ఇద్దరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. కట్ చేస్తే.. ఈ స్టోరీ క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ నెలకొంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక దొడ్డబళ్లాపురం పరిధిలోని కోళరు. ఇదే గ్రామంలో హారతి (27) అనే మహిళ నివాసం ఉంటుంది. ఈమెకు పెళ్లై ఓ కూతురు కూడా జన్మించింది. భర్తతో కొన్నాళ్ల పాటు బాగానే సంసారాన్ని కొనసాగించింది. అయితే, ఈ క్రమంలోనే ఈ దంపతుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇక భర్తతో ఉండలేని హారతి.. మరో చోట ఓ ఇంట్లో అద్దెకు దిగింది. ఈ క్రమంలోనే హారతికి హరీష్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఈ పరిచయం రాను రాను ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది. అలా వీరి చీకటి కాపురం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా వర్థిల్లుతూ వచ్చింది.

ఇదే విషయం హారతి భర్తకు తెలిసింది. అతడు కోపంతో ఊగిపోయాడు. ఎలాగో భార్య ఉంటున్న జాడను తెలుసుకున్నాడు. ఇక ఇటీవల ఆమె ప్రియుడు ఇంట్లో లేని సమయంలో అక్కడికి వెళ్లి భార్య హారతిని అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడే ఉన్న తన కూతురుని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: మాతృత్వానికి మచ్చతెచ్చిన తల్లి.. కన్నబిడ్డలను రెండో భర్త పరం చేసిన మహిళ!

Show comments