iDreamPost
android-app
ios-app

Jani Master: పోలీస్ స్టేషన్​లో జానీ మాస్టర్ భార్య రచ్చ! తను ఎక్కడంటూ?

  • Published Sep 19, 2024 | 3:05 PM Updated Updated Sep 19, 2024 | 3:42 PM

Jani Master Arrest, Jani Master Wife: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. తన దగ్గర పని చేస్తున్న ఓ మహిళా కొరియోగ్రాఫర్​ మీద లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జానీ మాస్టర్ వ్యవహారం ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది.

Jani Master Arrest, Jani Master Wife: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. తన దగ్గర పని చేస్తున్న ఓ మహిళా కొరియోగ్రాఫర్​ మీద లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జానీ మాస్టర్ వ్యవహారం ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది.

  • Published Sep 19, 2024 | 3:05 PMUpdated Sep 19, 2024 | 3:42 PM
Jani Master: పోలీస్ స్టేషన్​లో జానీ మాస్టర్ భార్య రచ్చ! తను ఎక్కడంటూ?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. తన దగ్గర పని చేస్తున్న ఓ మహిళా కొరియోగ్రాఫర్​ మీద లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జానీ మాస్టర్ వ్యవహారం ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది. టాలీవుడ్​లో దుమారం రేపుతున్న ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జానీ మాస్టర్​ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలోని ఓ లాడ్జిలో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి కోర్టులో హాజరు పరిచాక.. హైదరాబాద్​కు తీసుకొస్తున్నారు. అయితే జానీ మాస్టర్ భార్య ఆయేషా పోలీసు స్టేషన్​లో రచ్చ రచ్చ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నా జానీ ఎక్కడ.. అతడ్ని చూడాలి అంటూ ఆమె రచ్చ చేసింది.

జానీ మాస్టర్ నార్సింగి పోలీసు స్టేషన్​లో ఉన్నట్లు ఫేక్ కాల్ రావడంతో అతడి భార్య అక్కడికి చేరుకుంది. అతడ్ని చూడాలంటూ రచ్చ చేసింది. దీంతో ఆమెకు పోలీసులు సర్దిచెప్పారు. జానీ ఇంకా హైదరాబాద్ చేరుకోలేదని, గోవా నుంచి తీసుకొస్తున్నామని తెలిపారు. సిటీకి చేరుకునేందుకు ఇంకా టైమ్ పడుతుందని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంపై ఆమె స్పందించింది. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన ఆయేషా.. జానీ మాస్టర్​ను పీఎస్​కే తీసుకొచ్చినట్లుగా ఫేక్ కాల్ రావడంతో కనుక్కునేందుకు వచ్చానని చెప్పింది. అయితే జానీ మాస్టర్ అరెస్ట్​కు ఆమెనే కారణమని వార్తలు వస్తున్నాయి. అతడి ఆచూకీ ఆమెనే చెప్పిందని వినిపిస్తోంది. కాగా, ఈ కేసులో బాధిత లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తాను ఇచ్చిన కంప్లయింట్​లో అయేషా పేరును కూడా చేర్చిన విషయం తెలిసిందే.

జానీ మాస్టర్​ను నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరపరిచే అవకాశం ఉంది. కాగా, తనపై అతడు పలుమార్లు అత్యాచారం చేశాడంటూ లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్​లో ఆదివారం కేసు నమోదైంది. బాధితురాలు రాయదుర్గం పీఎస్​లో ఫిర్యాదు చేసింది. కానీ జీరో ఎఫ్ఐఆర్ కింద నమోదు చేసి నార్సింగికి బదిలీ చేశారు. ఆ తర్వాత పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేశారు. జానీ మాస్టర్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. బెంగళూరులో అతడు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే గోవాలో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. జానీని హైదరాబాద్​కు తీసుకొస్తున్న తరుణంలో అతడి భార్య పోలీసు స్టేషన్​లో హల్​చల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అతడు పీఎస్​లో ఉన్నట్లు ఫేక్ కాల్ రావడంతో నా జానీ ఎక్కడంటూ ఆయేషా రచ్చ రచ్చ చేసింది. మరి.. ఈ మొత్తం వ్యవహారంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.