iDreamPost
android-app
ios-app

సినిమా రేంజ్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరి.. కానీ, చివరికి..

  • Published Sep 19, 2024 | 2:07 PM Updated Updated Sep 19, 2024 | 2:07 PM

తాజాగా జరిగిన ఓ ఘటనలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఓ ట్రయాంగిల్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడింది. అచ్చం సినిమాను తలపించేలా ఈ స్టోరీలో ఓ ఇద్దరు మహిళలు.. హీరో, విలన్ మాదిరిగా ఫైటింగ్ చేసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

తాజాగా జరిగిన ఓ ఘటనలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఓ ట్రయాంగిల్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడింది. అచ్చం సినిమాను తలపించేలా ఈ స్టోరీలో ఓ ఇద్దరు మహిళలు.. హీరో, విలన్ మాదిరిగా ఫైటింగ్ చేసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

  • Published Sep 19, 2024 | 2:07 PMUpdated Sep 19, 2024 | 2:07 PM
సినిమా రేంజ్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరి.. కానీ, చివరికి..

సాధారణంగా ఏదైనా సినిమాల్లో క్రైమ్, ఎమోషనల్, లవ్ సీన్స్ చూస్తే.. అబ్బా నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా ఆ సన్నివేశాలు తీశారని అనుకుంటాం. కానీ, నిజానికి సమాజంలో జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనలు ఆధారంగానే.. ప్రస్తుతం దర్శకులు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడిదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా.. మరెమీ లేదండీ.. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఓ సంఘటన కూడా అచ్చం సినిమాను తలపించే సన్నివేశంలా అనిపిస్తుంది. కాకపోతే మేటర్ లోకి వెళ్లే ముందు మనం ఆనంద్ దేవరకొండ నటించిన బేబి సినిమా గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది.

ఎందుకంటే.. ఈ సినిమాకి ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటనకు చాలా దగ్గర ఉంటుంది కానీ, ఇక్కడ కొంచెం సీన్ రివర్స్ గా ఉంటుంది. అదేనండి.. బేబి సినిమాలో హీరోయిన్ వైష్ణవి ఒకరి తేలియకుండా మరొకరి లవ్ చేస్తుంది. కానీ, కథ క్లైమాక్స్ లోకి వచ్చి నిజం తెలిసినప్పుడు.. అది నా పిల్లరా అంటూ.. ఒకరికొకరు కొట్టుకుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ సంఘటనలో మాత్రం ఓ ఇద్దరు మహిళలు ప్రియుడు కోసం ఒకరినొకరు జుట్టులు పట్టుకొని కొట్టుకున్నారు. మరి, ఆ వివరాళ్లేంటో తెలుసుకుందాం.

 ప్రియుడి కోసం ఓ ఇద్దరు మహిళలు సినిమాల్లో విలన్, హీరో మాదిరిగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నా ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో చోటు చేసుకుంది. మచిలీపట్నాంకు చెందిన బిల్డర్ విజయ్ అనే వ్యక్తి  ఓ ఇద్దరి మహిళలతో ప్రేమయాణం నడిపించాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. అయితే ఓ రోజు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరికి ఎండ్ కార్డు పడే రోజు వచ్చింది. బిల్డర్ విజయ్ పై అనుమానం ఉన్న అతని మొదటి ప్రియురాలు అనూష ఆయన ఇంటికి వచ్చింది. తీరా అక్కడే అసలు విషయం బయట పడింది. విజయ్, అనిత అనే మరో మహిళతో కొన్నాళ్లుగా కలిసివుంటున్నాడు. అయితే ఈ విషయం తెలియడంతో ఆ మహిళ తనకు అన్యాయం జరిగడం భరించలేక.. విజయ్ కారును తగులబెట్టింది.

ఇది చూసిన అనిత అనే మహిళ తన ప్రియుడు మరొక మహిళను కూడా ప్రేమిస్తున్నాడని తెలిసి అతనికి బుద్ధి చెప్పాల్సింది పోయి.. చివరి ఆ మహిళతో వివాదానికి దిగింది. దీంతో ఇద్దరు మహిళలు ప్రియుడి కోసం నావడంటే.. నావాడు అంటూ జుత్తులు పట్టుకొని కొట్టుకున్నారు. దీంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.  అయితే ఈ ఘటనలో సదరు మహిళ అనూష స్థానిక మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. మచిలీపట్నంకు చెందిన విజయ్ అనే బిల్డర్ తాను ఏడేళ్లుగా ప్రేమించుకున్నాం. అలాగే విజయ్ తనని పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించి.. తన వద్ద దగ్గర రూ..15 లక్షల డబ్బులు రూ.10 లక్షల బంగారం తీసుకున్నాడని ఆరోపించింది. అయితే అతడికి డబ్బుల ఇచ్చేందుకు తాను చుట్టాల దగ్గర అప్పు చేసి ఇచ్చానని.. బంగారాన్ని నాలుగుసార్లు తాకట్టు పెట్టి తిరిగి ఇచ్చాడని.. ఐదోసారి మాత్రం బంగారం తిరిగి ఇవ్వకుండా బ్లాక్ చేశాడన్నారు. తన బంగారం గురించి అడిగితే తాకట్టులో ఉందని చెప్పాడని తెలిపింది. దీంతో అతనిపై అనుమానం కలిగి ఆరా తీస్తే.. విజయ్ ఏడాదిగా మచిలీపట్నంలో అనిత అనే మరో మహిళతో కలిసి ఉన్నట్లు తెలిసింది.

పైగా విజయ్, అనితకు రూ.23 లక్షలతో ఫ్లాట్ కొనిచ్చాడని.. మరి తన డబ్బులు ఏం చేశాడో తెలియడం లేదని, అడిగితే తననే బెదిరిస్తున్నాడని వాపోయింది. అంతేకాకుండా.. విజయ్‌తో కలిసి ఉంటున్న అనితకు గతంలో వివాహమై భర్త ఉన్నాడని.. ఆమెను విజయ్ పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియదని చెప్పుకొచ్చింది. ఇకపోతే అనూష తనకు జరిగిన అన్యాయంపై ఇప్పటికే విజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానని, అలాగే విజయ్, అనితల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. వారిద్దరు తనపై దాడి చేశారని అనూష ఆరోపిస్తున్నారు. మరి, మచిలీపట్నంలో ప్రియుడి కోసం ఇద్దరి మహిళలు కొట్టుకున్ ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.