iDreamPost
android-app
ios-app

అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతల అరాచకం.. కర్రలు, రాళ్లతో దాడి!

అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతల అరాచకం.. కర్రలు, రాళ్లతో దాడి!

టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎక్కడ పర్యటించిన..  ఆ ప్రాంతం రణంరంగా మారుతుందని వైసీపీ నేతలు  అంటున్నారు. చంద్రబాబు కావాలనే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి.. గందరగోళం సృష్టిస్తుంటారు. ఈక్రమంలో టీడీపీ నేతలు కూడా  దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటనలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. చంద్రబాబు పర్యటనలో టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్  చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగారు. చిత్తూరు జిల్లాలోని అంగళ్ల కూడలి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.

శుక్రవారం  చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో  చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఆరాచకం సృష్టించారు, కర్రలు, రాళ్లతో వైసీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు.   ఈదాడులు వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. చంద్రబాబు పర్యటనలో వైసీపీ  ఫ్లైక్సీలను టీడీపీ కార్యకర్తలు చించేశారు. అలానే కర్రలతో దాడులకు తెగబడ్డారు.  చంద్రబాబు పర్యటనలో అడుగడుగున ఉద్రికత్త వాతావరణం నెలకొంది. పోలీసుల వాహనాలకు టీడీపీ కార్యకర్తలు నిప్పటించారు.

ఈ దాడుల్లో రెండు వాహనాలకు నిప్పంటుకుని కాలిపోయాయి. ఈ దాడుల్లో పోలీసులపైకి కూడా రాళ్లు విసిరడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు పరిస్థితులను అదుపు చేసేందుకు లాఠీ ఛార్జీ చేసినట్లు తెలుస్తోంది. అలానే టియర్ గ్యాస్ ను ప్రయోగించారు.  ఇద్దరు ఎస్సైలు, పది మంది కానిస్టేబులకు తీవ్రగాయాలయ్యాయి. ఆందోళన గారులపై రబ్బరు బుల్లెట్లను ప్రయోగించినట్లు తెలుస్తుంది. చిత్తూరు జిల్లా అంగళ్ల  కూడలి ప్రాంతం యుద్ధ భూమిని తలపిస్తుంది. మరి.. చంద్రబాబు పర్యటనలో ఇలా ఉద్రికత్త నెలకొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: యువగళం పాదయాత్రలో లోకేశ్‌కు తప్పిన ప్రమాదం!

gamdomCasibommarsbahis girişMarsbahisJojobetJojobet Giriş